ETV Bharat / state

హైదరాబాద్​లో మొదటిరోజు కేంద్ర వైద్య బృందం పర్యటన - Central_Team_Visit to hyderabad first day

కరోనా వైరస్​ కట్టడికి జీహెచ్​ఎంసీ, వైద్యారోగ్య బృందాలతో కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామంటూ హైదరాబాద్​ పోలీసులు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందానికి తెలిపారు. నగరంలో పోలీసులు చేపట్టిన చర్యలు తెలుసుకునేందుకు కేంద్ర బృందం సభ్యులు హైదరాబాద్​ పోలీస్ కమిషనరేట్​కు వెళ్లారు. తాము చేపట్టిన చర్యలను సీపీ అంజనీకుమార్​ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు.

Central_Team_Visit to hyderabad first day
హైదరాబాద్​లో మొదటిరోజు కేంద్ర వైద్య బృందం పర్యటన
author img

By

Published : Apr 26, 2020, 6:13 AM IST

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకునేందుకు కేంద్ర బృందం హైదరాబాద్​లో పర్యటించింది. నగర పోలీసు కమిషనర్​ కార్యాలయంతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో బృందం పర్యటించింది. వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి పోలీసు అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు తగిన భద్రత కల్పించామని... సాయిధ సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలిపారు. వైద్యులపై జరిగిన దాడుల్లో రెండు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.

లాక్​డౌన్​ ఉల్లంఘించిన వారిపై కేసులు..

లాక్​డౌన్​ ఉల్లంఘనలపై ఇప్పటివరకు 73 వేల మందిపై కేసులు నమోదు చేసి.. 97 వేల వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కరోనా వైరస్​ వ్యాప్తి విదేశాల నుంచి హైదరాబాద్​కు వచ్చినవారు, మర్కజ్​ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి ద్వారానే జరిగిందని పోలీసులు కేంద్ర బృందానికి వివరించారు. వైరస్​ సోకిన కొందరి విషయంలోనే మూలాలను వెతుకుతున్నామన్నారు.

హైదరాబాద్​లో మొదటిరోజు కేంద్ర వైద్య బృందం పర్యటన

పాజిటివ్​ కేసుల మూలకారణాన్ని వివరించిన పోలీసులు...

ఖైరతాబాద్​లో కరోనాతో ఓ వృద్ధురాలు మరణించింది. స్థానికులు క్వారంటైన్​కు తరలించి కొవిడ్​ పరీక్షలు నిర్వహించి వృద్ధురాలి 38 మంది కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించారు. కాని వృద్ధురాలికి వైరస్​ ఎక్కడి నుంచి సోకిందనే విషయం ఇంకా అర్థం కాలేదు. కాలాపత్తర్​ ప్రాంతంలో ఈ నెల 12న ఓ యాభై ఏళ్ల మహిళ చనిపోయింది. వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్​ అని తేలింది. ఆమె భర్తతో పాటు 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. వారందరినీ క్వారంటైన్​కు తరలించారు. వీటికి మూలకారణాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకునేందుకు కేంద్ర బృందం హైదరాబాద్​లో పర్యటించింది. నగర పోలీసు కమిషనర్​ కార్యాలయంతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో బృందం పర్యటించింది. వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి పోలీసు అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు తగిన భద్రత కల్పించామని... సాయిధ సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలిపారు. వైద్యులపై జరిగిన దాడుల్లో రెండు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.

లాక్​డౌన్​ ఉల్లంఘించిన వారిపై కేసులు..

లాక్​డౌన్​ ఉల్లంఘనలపై ఇప్పటివరకు 73 వేల మందిపై కేసులు నమోదు చేసి.. 97 వేల వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కరోనా వైరస్​ వ్యాప్తి విదేశాల నుంచి హైదరాబాద్​కు వచ్చినవారు, మర్కజ్​ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి ద్వారానే జరిగిందని పోలీసులు కేంద్ర బృందానికి వివరించారు. వైరస్​ సోకిన కొందరి విషయంలోనే మూలాలను వెతుకుతున్నామన్నారు.

హైదరాబాద్​లో మొదటిరోజు కేంద్ర వైద్య బృందం పర్యటన

పాజిటివ్​ కేసుల మూలకారణాన్ని వివరించిన పోలీసులు...

ఖైరతాబాద్​లో కరోనాతో ఓ వృద్ధురాలు మరణించింది. స్థానికులు క్వారంటైన్​కు తరలించి కొవిడ్​ పరీక్షలు నిర్వహించి వృద్ధురాలి 38 మంది కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించారు. కాని వృద్ధురాలికి వైరస్​ ఎక్కడి నుంచి సోకిందనే విషయం ఇంకా అర్థం కాలేదు. కాలాపత్తర్​ ప్రాంతంలో ఈ నెల 12న ఓ యాభై ఏళ్ల మహిళ చనిపోయింది. వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్​ అని తేలింది. ఆమె భర్తతో పాటు 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. వారందరినీ క్వారంటైన్​కు తరలించారు. వీటికి మూలకారణాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.