హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఐఏఎస్ అధికారి అరుణ్ బకోరా బృందం.. చార్మినార్, మక్కా మసీదులను పరిశీలించింది. కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యల గురించి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కేంద్ర బృందానికి వివరించారు. లాక్డౌన్ అమలు తీరు గురించి కూడా కమిషనర్ వారికి తెలియజేశారు.
చార్మినార్, మక్కా మసీదు చారిత్రక కట్టడాల గురించి బృందానికి అంజనీకుమార్ వివరించారు. కొద్దిసేపు అక్కడే ఉన్న కేంద్ర బృందం పాతబస్తీ నుంచి తిరిగి వెళ్లిపోయింది. బృందం వెంట ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్కుమార్, ట్రాఫిక్ డీసీపీ బాబురావు తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...