ఏప్రిల్ 1 నుంచి సరళీకృత జీఎస్టీని పూర్తిస్థాయిలో వర్తింపజేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో చిన్నతరహా పారిశ్రామికవేత్తల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.
జీఎస్టీకి సంబంధించిన సందేహాలు సమస్యలను నివృత్తి చేయడానికి కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ బోర్డు బృందం ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనుందని తెలిపారు. సీబీఐసీ ఛైర్మన్ శేషగిరిరావు బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పర్యటించి జీఎస్టీపై ఉన్న సందేహాలు నివృత్తి చేస్తారని నిర్మలాసీతారామన్ వివరించారు.
ఇవీ చూడండి: 50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత