రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కొదండరాం అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ లేకపోవడం దారుణమన్నారు. ఈ హత్య ఒక వ్యక్తి చేసింది కాదని... వాస్తవాలు బయటికి రావాలంటే సీబీఐతో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. విజయారెడ్డి నివాసానికి వెళ్లిన కొదండరాం... ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
స్థానిక అధికార పార్టీ నాయకులే పనిచేయకుండా అడ్డుకున్నారని విజయారెడ్డి తనకు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: నిందితుడిని ఉపేక్షించేది లేదు: సత్యవతి రాఠోడ్