ETV Bharat / state

'మా వద్ద బోలెడు ఓట్లున్నాయ్ - మీ రేటెంతో చెబితే ఓ మాటనేసుకుందాం'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 12:30 PM IST

Cash For Vote in Telangana Election 2023 : బ్రిటీష్​ వారితో ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు సాధించిన త్యాగ ఫలమే ఈ ప్రజాస్వామ్య భారతం. అలాంటి మనకంటూ హక్కులను సాధించిపెట్టి.. ప్రజల ద్వారానే నాయకుడు ఎన్నిక అవ్వాలనే ఉద్దేశంతో ఓటుహక్కును కల్పించారు. కానీ ఇప్పుడు నాటి పరిస్థితులు పోయి నోటు ఇస్తేనే ఓటు అన్నట్లు సాగుతోంది.

Political Leaders Distribute Money
Political Leaders Distribute Money in Telangana Election

Cash For Vote in Telangana Election 2023 : ఓటు అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వజ్రాయుధం. ఒకే ఒక్క ఓటు ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు.. అవే ప్రభుత్వాలను కూలగొట్టవచ్చు. అలాంటి ఓటును కేవలం నాలుగు నోట్ల కాగితాలకు అమ్ముకుంటే మన భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆ నాలుగు నోట్లను మీకిచ్చి.. మీ, మీ బిడ్డలు, భావితరాల భవిష్యత్తును కూడా ఓవర్​ జోన్​లో పడేసే స్థితికి తీసుకువస్తున్నారు. కొంతమంది నాయకులు ఇలా ఉంటే.. కొన్నిప్రాంతాల్లో ఓటర్లు కూడా తక్కువేం కాదంటూ 'మా వద్ద ఓట్లున్నాయి మీ రేటెంత' అంటూ అభ్యర్థులతో బేరాలాడుతున్నారు.

మా వద్ద 800 ఓట్లు ఉన్నాయి ఎంత రేటు : "మా వాళ్లందరి ఓట్లు(Votes) 800 ఉన్నాయి.. అయితే ఇప్పటివరకు మేము ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం సార్​. మాకు ఒక్కో ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే.. కాదంటే చెప్పడం మరో పార్టీ పిలుస్తోంది. అయితే మీరు తమకు అడ్వాన్స్​ ఇస్తే.. మీకే ఫిక్స్​ అయిపోతాం" ఇలా హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మధ్యవర్తులు గల్లీనేతలతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు.

బిర్యానీ, మాంసం కూర పార్శిల్స్​ ఇంటి వద్దకే : ఖైరతాబాద్​ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్​ హాల్​లో వారం రోజులుగా ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. రోజుకు కనీసం 1000 మందికి సరిపడేలా మాంసాహార భోజనం సిద్ధం చేస్తున్నారు. దీనికయ్యే ఖర్చంతా ప్రముఖ బిర్యానీ హోటల్​ నిర్వాహకులే భరిస్తూ.. అక్కడికి రాని వారికి ఇంటికే పార్శిల్​ పంపుతున్నారు.

Temptations in Telangana Elections 2023 : అయితే టోలిచౌకి ప్రాంతంలో ఆదివారం నుంచే ఇలా భోజనం సిద్ధం చేస్తున్నారు. డివిజన్లలో ఉండే నాయకులు.. తటస్థ ఓటర్లను గుర్తించి.. వారిని ప్రలోభానికి గురి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో(Telangana Election) పోరు రసవత్తరంగా ఉండగా.. ఒక్క ఓటైనా వారి తలరాతను మార్చేదిగా భావిస్తున్నారు. అందుకే చోటా, గల్లీ నేతలు వారి కటాక్షం పొందే పనిలో పడ్డారు. కుల, మత, కాలనీ సంఘ నేతలు అభ్యర్థులతో మంతనాలు జరుపుతూ.. వారి చేతుల్లో ఉన్న ఓట్లన్నీ వేయిస్తామని హామీ ఇస్తున్నారు. అందుకు భారీ మొత్తంలోనే గుంజుతున్నారు.

మీరు తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ఓటుకు ఎంతైన ఇవ్వడానికి ఓకే అంటున్న నాయకులు : గ్రేటర్​ హైదరాబాద్​లోని ఖైరతాబాద్​, సనత్​నగర్​, జూబ్లీహిల్స్​, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, అంబర్​పేట, ఎల్బీనగర్​, మల్కాజిగిరి, మహేశ్వరం, చేవెళ్ల, ముషీరాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ద్విముఖ పోరు ఉన్న చోట ఓటుకు ఒక రేటు.. త్రిముఖ పోరుకు మరోరేటుగా లెక్క ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ద్విముఖ పోరు ఉన్నదగ్గర ఒక ఓటు ధర(Vote for Note) రూ.5000-రూ.6000 పలకగా.. త్రిముఖ పోరులో రూ.1500-రూ.2000 మధ్య ఉంది.

Money Distribution in Telangana Elections 2023 : హైదరాబాద్​ నగర శివారు నియోజకవర్గమైన ఎల్బీనగర్​లో ఓ ప్రధాన పార్టీ కొత్త తరహా నగదు పంపిణీ విధానాన్ని అవలంభిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతుంది. ఇక్కడ పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి ఆదివారం రాత్రి మనీపర్సులను పంపిణీ చేస్తూ కనిపించారు. ఆ పర్సును ఓపెన్​ చేసి చూడగా అందులో నాలుగు రూ.500ల నోట్లు ఉంటున్నాయి. అయితే ఓ ఓటరు అందరికీ పెద్ద మొత్తంలో కమీషన్లు కొడతారు.. మాకు ఇంతనేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంతలో మరో వ్యక్తి రెండు వేల రూపాయలు అందాయి కదా.. ఇకేంది అన్నా నీలొల్లి అంటూ ఆపే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ మనీపర్సుల పంపిణీ(Money Purse) హాట్​టాఫిక్​గా మారింది.

ఓటు ఒక వజ్రాయుధం - మరి ఓటేస్తానికి మీరు సిద్ధమా

ఓటేద్దాం - మంచి నాయకుడిని ఎన్నుకుందాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం

Cash For Vote in Telangana Election 2023 : ఓటు అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వజ్రాయుధం. ఒకే ఒక్క ఓటు ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు.. అవే ప్రభుత్వాలను కూలగొట్టవచ్చు. అలాంటి ఓటును కేవలం నాలుగు నోట్ల కాగితాలకు అమ్ముకుంటే మన భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆ నాలుగు నోట్లను మీకిచ్చి.. మీ, మీ బిడ్డలు, భావితరాల భవిష్యత్తును కూడా ఓవర్​ జోన్​లో పడేసే స్థితికి తీసుకువస్తున్నారు. కొంతమంది నాయకులు ఇలా ఉంటే.. కొన్నిప్రాంతాల్లో ఓటర్లు కూడా తక్కువేం కాదంటూ 'మా వద్ద ఓట్లున్నాయి మీ రేటెంత' అంటూ అభ్యర్థులతో బేరాలాడుతున్నారు.

మా వద్ద 800 ఓట్లు ఉన్నాయి ఎంత రేటు : "మా వాళ్లందరి ఓట్లు(Votes) 800 ఉన్నాయి.. అయితే ఇప్పటివరకు మేము ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం సార్​. మాకు ఒక్కో ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే.. కాదంటే చెప్పడం మరో పార్టీ పిలుస్తోంది. అయితే మీరు తమకు అడ్వాన్స్​ ఇస్తే.. మీకే ఫిక్స్​ అయిపోతాం" ఇలా హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మధ్యవర్తులు గల్లీనేతలతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు.

బిర్యానీ, మాంసం కూర పార్శిల్స్​ ఇంటి వద్దకే : ఖైరతాబాద్​ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్​ హాల్​లో వారం రోజులుగా ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. రోజుకు కనీసం 1000 మందికి సరిపడేలా మాంసాహార భోజనం సిద్ధం చేస్తున్నారు. దీనికయ్యే ఖర్చంతా ప్రముఖ బిర్యానీ హోటల్​ నిర్వాహకులే భరిస్తూ.. అక్కడికి రాని వారికి ఇంటికే పార్శిల్​ పంపుతున్నారు.

Temptations in Telangana Elections 2023 : అయితే టోలిచౌకి ప్రాంతంలో ఆదివారం నుంచే ఇలా భోజనం సిద్ధం చేస్తున్నారు. డివిజన్లలో ఉండే నాయకులు.. తటస్థ ఓటర్లను గుర్తించి.. వారిని ప్రలోభానికి గురి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో(Telangana Election) పోరు రసవత్తరంగా ఉండగా.. ఒక్క ఓటైనా వారి తలరాతను మార్చేదిగా భావిస్తున్నారు. అందుకే చోటా, గల్లీ నేతలు వారి కటాక్షం పొందే పనిలో పడ్డారు. కుల, మత, కాలనీ సంఘ నేతలు అభ్యర్థులతో మంతనాలు జరుపుతూ.. వారి చేతుల్లో ఉన్న ఓట్లన్నీ వేయిస్తామని హామీ ఇస్తున్నారు. అందుకు భారీ మొత్తంలోనే గుంజుతున్నారు.

మీరు తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ఓటుకు ఎంతైన ఇవ్వడానికి ఓకే అంటున్న నాయకులు : గ్రేటర్​ హైదరాబాద్​లోని ఖైరతాబాద్​, సనత్​నగర్​, జూబ్లీహిల్స్​, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, అంబర్​పేట, ఎల్బీనగర్​, మల్కాజిగిరి, మహేశ్వరం, చేవెళ్ల, ముషీరాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ద్విముఖ పోరు ఉన్న చోట ఓటుకు ఒక రేటు.. త్రిముఖ పోరుకు మరోరేటుగా లెక్క ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ద్విముఖ పోరు ఉన్నదగ్గర ఒక ఓటు ధర(Vote for Note) రూ.5000-రూ.6000 పలకగా.. త్రిముఖ పోరులో రూ.1500-రూ.2000 మధ్య ఉంది.

Money Distribution in Telangana Elections 2023 : హైదరాబాద్​ నగర శివారు నియోజకవర్గమైన ఎల్బీనగర్​లో ఓ ప్రధాన పార్టీ కొత్త తరహా నగదు పంపిణీ విధానాన్ని అవలంభిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతుంది. ఇక్కడ పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి ఆదివారం రాత్రి మనీపర్సులను పంపిణీ చేస్తూ కనిపించారు. ఆ పర్సును ఓపెన్​ చేసి చూడగా అందులో నాలుగు రూ.500ల నోట్లు ఉంటున్నాయి. అయితే ఓ ఓటరు అందరికీ పెద్ద మొత్తంలో కమీషన్లు కొడతారు.. మాకు ఇంతనేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంతలో మరో వ్యక్తి రెండు వేల రూపాయలు అందాయి కదా.. ఇకేంది అన్నా నీలొల్లి అంటూ ఆపే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ మనీపర్సుల పంపిణీ(Money Purse) హాట్​టాఫిక్​గా మారింది.

ఓటు ఒక వజ్రాయుధం - మరి ఓటేస్తానికి మీరు సిద్ధమా

ఓటేద్దాం - మంచి నాయకుడిని ఎన్నుకుందాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.