ETV Bharat / state

రేపు నారాయణగూడలోని ఐపీఎంలో రక్తదాన శిబిరం

తలసేమియా బాధితుల కోసం సైబరాబాద్ పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం 11 గంటలకు నారాయణగూడలోని ఐపీఎంలో రక్తదానం కార్యక్రమం నిర్వహించనున్నారు.

author img

By

Published : Apr 11, 2020, 1:15 PM IST

blood donation camp will conduct by cybarabad police on tomorrow
రేపు నారాయణగూడలోని ఐపీఎంలో రక్తదాన శిబిరం

హైదరాబాద్​ నారాయణగూడలోని ఐపీఎంలో రేపు ఉదయం 11 గంటలకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు సైబరాబాద్​ పోలీసులు. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్​లో ఇప్పటికే పలువురు రక్తదాతలు ఉన్నారు. వారితో పాటు స్వచ్ఛందంగా రక్తదానం చేసే వాళ్లు 9490617440, 9490617431 నెంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సైబరాబాద్ కమిషనరేట్​లోని కొవిడ్ కంట్రోల్ రూమ్​కి వస్తే ప్రత్యేక వాహనంలో నారాయణగూడ తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో 1700 పైగా ఉన్న తలసేమియా వ్యాధిగ్రస్తులు నెలలో రెండుసార్లు రక్తం ఎక్కించుకోవాల్సి ఉందని... రక్త నిల్వల కొరత వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

హైదరాబాద్​ నారాయణగూడలోని ఐపీఎంలో రేపు ఉదయం 11 గంటలకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు సైబరాబాద్​ పోలీసులు. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్​లో ఇప్పటికే పలువురు రక్తదాతలు ఉన్నారు. వారితో పాటు స్వచ్ఛందంగా రక్తదానం చేసే వాళ్లు 9490617440, 9490617431 నెంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సైబరాబాద్ కమిషనరేట్​లోని కొవిడ్ కంట్రోల్ రూమ్​కి వస్తే ప్రత్యేక వాహనంలో నారాయణగూడ తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో 1700 పైగా ఉన్న తలసేమియా వ్యాధిగ్రస్తులు నెలలో రెండుసార్లు రక్తం ఎక్కించుకోవాల్సి ఉందని... రక్త నిల్వల కొరత వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.