ETV Bharat / state

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

author img

By

Published : Jul 24, 2020, 7:33 PM IST

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యూసుఫ్ గూడ స్టేడియంలో సుమారు 3 వేల మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Blood donation camp on the occasion of Minister KTR's birthday
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యూసుఫ్ గూడ స్టేడియంలో సుమారు 3 వేల మంది రక్తదానంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యే ప్రయత్నంతో శిబిరం ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలోని వివిధ వార్డులోని తెరాస కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యూసుఫ్ గూడ స్టేడియంలో సుమారు 3 వేల మంది రక్తదానంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యే ప్రయత్నంతో శిబిరం ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలోని వివిధ వార్డులోని తెరాస కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండీ: కూకట్​పల్లిలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.