ETV Bharat / state

'మజ్లిస్ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది'

author img

By

Published : Feb 21, 2020, 3:00 PM IST

మజ్లిస్ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ఆరోపించారు. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఎంఐఎంకు తోడు పార్టీలుగా తెరాస, కాంగ్రెస్ పార్టీలు మారాయని దుయ్యబట్టారు.

bjp spoke person comments on mim
భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్

మజ్లిస్ మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందని భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లను ఆధారం చేసుకొని ఎంఐఎం దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. ఎంఐఎంకు తోడు పార్టీలుగా తెరాస, కాంగ్రెస్ మారాయని దుయ్యబట్టారు.

పార్లమెంట్​లో మాత్రం లౌకికవాదమా?

యువతితో పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయించిన అసదుద్దీన్... పార్లమెంట్​లో మాత్రం లౌకికవాదం గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. సెక్యులరిజం గురించి చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు?

ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ,ఉత్తమ్ ఎక్కడకు వెళ్లారన్నారన్నారు. సీఏఏ ఊరేగింపులకు భారతదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా అని.. వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్ జెండా అని కృష్ణసాగర్ రావు ఆరోపించారు.

భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్

ఇవీ చూడండి: సమాజం మార్పునకు తయారు చేసిన ఆయుధమే 'కమ్యూనిస్ట్​ మానిఫెస్టో'

మజ్లిస్ మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందని భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లను ఆధారం చేసుకొని ఎంఐఎం దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. ఎంఐఎంకు తోడు పార్టీలుగా తెరాస, కాంగ్రెస్ మారాయని దుయ్యబట్టారు.

పార్లమెంట్​లో మాత్రం లౌకికవాదమా?

యువతితో పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయించిన అసదుద్దీన్... పార్లమెంట్​లో మాత్రం లౌకికవాదం గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. సెక్యులరిజం గురించి చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు?

ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ,ఉత్తమ్ ఎక్కడకు వెళ్లారన్నారన్నారు. సీఏఏ ఊరేగింపులకు భారతదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా అని.. వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్ జెండా అని కృష్ణసాగర్ రావు ఆరోపించారు.

భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్

ఇవీ చూడండి: సమాజం మార్పునకు తయారు చేసిన ఆయుధమే 'కమ్యూనిస్ట్​ మానిఫెస్టో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.