ETV Bharat / state

రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరం : రాంచందర్​ రావు - రేవంత్ రెడ్డిపై భాజపా ఎమ్మెల్సీ ధ్వజం

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఖండించారు. అవినీతి కేసుల్లో కోర్టుకు హాజరవుతూ నీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ కనుమరుగు కాకుండా దృష్టి పెట్టాలని రేవంత్​కు చురలంటించారు.

bjp mlc ram chander rao fire in congress working president revanth reddy
రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరం : రాంచందర్​రావు
author img

By

Published : Feb 4, 2021, 9:31 PM IST

కిషన్​రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ రేవంత్​ రెడ్డికి లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు అన్నారు. కిషన్​ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీలు ఫిరాయించే రేవంత్​ రెడ్డి.. భాజపా నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు పక్కనచేరి ఓటు కోసం కోట్లు ఇవ్వచూపి అడ్డంగా దొరికిన వ్యక్తి భాజపా నాయకులను విమర్శించడం సిగ్గుచేటన్నారు.

మాపై విమర్శలు మాని కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌, తెరాస మధ్య ఉన్న సంబంధాలను ముందు తేల్చుకోవాలని సూచించారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా నిబద్ధత, నిజాయతీగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కిషన్‌ రెడ్డి మీద రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి ఆరోపణలు కొనసాగిస్తే మీ పార్టీకి పుట్టగతులుండవని రాచందర్ ​రావు హెచ్చరించారు.

ఇదీ చూడండి: రైతుల ఉద్యమానికి తెలంగాణ అన్నదాతల మద్దతు: ఈటల

కిషన్​రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ రేవంత్​ రెడ్డికి లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు అన్నారు. కిషన్​ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీలు ఫిరాయించే రేవంత్​ రెడ్డి.. భాజపా నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు పక్కనచేరి ఓటు కోసం కోట్లు ఇవ్వచూపి అడ్డంగా దొరికిన వ్యక్తి భాజపా నాయకులను విమర్శించడం సిగ్గుచేటన్నారు.

మాపై విమర్శలు మాని కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌, తెరాస మధ్య ఉన్న సంబంధాలను ముందు తేల్చుకోవాలని సూచించారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా నిబద్ధత, నిజాయతీగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కిషన్‌ రెడ్డి మీద రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి ఆరోపణలు కొనసాగిస్తే మీ పార్టీకి పుట్టగతులుండవని రాచందర్ ​రావు హెచ్చరించారు.

ఇదీ చూడండి: రైతుల ఉద్యమానికి తెలంగాణ అన్నదాతల మద్దతు: ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.