హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి వద్ద భాజపా నేతలు ఆందోళనకు దిగారు. కరోనా పేరుతో శ్వేత అనే మహిళ వద్ద లక్షల్లో డబ్బు గుంజి, చివరకు గుండెపోటుతో మరణించిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపించారు. సెప్టెంబర్ మూడో తేదిన చనిపోతే 4న మృతి చెందినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని మండిపడ్డారు.
శ్వేత రిపోర్టుల కోసం ఆస్పత్రికి వెళ్లిన మాధవరావును యాజమాన్యం నిర్బంధించిందని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన భాజపా నేతలను అరెస్టు చేసిన పోలీసులు.. మలక్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
- ఇవీ చూడండి: కరోనా పరీక్షలు వాళ్లందరికీ చేయాల్సిందే: ఐసీఎంఆర్