ETV Bharat / state

లుకౌట్‌ నోటీసుల పేరుతో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: రాంచందర్​ రావు - ఎమ్మెల్యేల ఎర కేసుపై రాంచందర్​రావు వ్యాఖ్యలు

Ramchander Rao on Buying TRS MLAs Issue: సిట్ కేసులో బీజేపీ నాయకులకు లుకౌట్ నోటీసుల పేరుతో టీఆర్​ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు ధ్వజమెత్తారు. చౌకబారు రాజకీయాలు చేస్తే భాజపా భయపడదని పేర్కొన్నారు. టీఆర్​ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు.

Ramchander Rao
Ramchander Rao
author img

By

Published : Nov 22, 2022, 4:04 PM IST

Ramchander Rao on Buying TRS MLAs Issue: సిట్‌ కేసులో బీజేపీ నాయకులకు లుకౌట్ నోటీసులిచ్చారని... అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. లుకౌట్ నోటీసులకు ఎం.హెచ్.ఎ కొన్ని గైడలెన్స్​లు ఉన్నాయని తెలిపారు. లుకౌట్ నోటిసులపై తెరాస తప్పుడు సమాచారం ఇస్తుందని ఆయన మండిపడ్డారు.

టీఆర్​ఎస్ నాయకుడు రావుల శ్రీధర్, తెరాస సామాజిక మాధ్యమాల ప్రతినిధి సతీష్ రెడ్డి అనే వ్యక్తులకు ఏం అధికారం ఉందని లుకౌట్ నోటీసుల గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఫేక్ న్యూస్​పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పందించాలని కోరారు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకొని... నిక్షిప్తంగా దర్యాప్తు చేయాలని రాంచందర్​రావు డిమాండ్ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారనే నెపంతోనే సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. తెరాస ఎన్ని చౌకబారు రాజకీయాలు చేసిన తమ పార్టీ దీటుగా ఎదుర్కొంటుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Ramchander Rao on Buying TRS MLAs Issue: సిట్‌ కేసులో బీజేపీ నాయకులకు లుకౌట్ నోటీసులిచ్చారని... అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. లుకౌట్ నోటీసులకు ఎం.హెచ్.ఎ కొన్ని గైడలెన్స్​లు ఉన్నాయని తెలిపారు. లుకౌట్ నోటిసులపై తెరాస తప్పుడు సమాచారం ఇస్తుందని ఆయన మండిపడ్డారు.

టీఆర్​ఎస్ నాయకుడు రావుల శ్రీధర్, తెరాస సామాజిక మాధ్యమాల ప్రతినిధి సతీష్ రెడ్డి అనే వ్యక్తులకు ఏం అధికారం ఉందని లుకౌట్ నోటీసుల గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఫేక్ న్యూస్​పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పందించాలని కోరారు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకొని... నిక్షిప్తంగా దర్యాప్తు చేయాలని రాంచందర్​రావు డిమాండ్ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారనే నెపంతోనే సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. తెరాస ఎన్ని చౌకబారు రాజకీయాలు చేసిన తమ పార్టీ దీటుగా ఎదుర్కొంటుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.