ETV Bharat / state

కరోనా కాలంలోనూ ఉత్తమ పనితీరు.. బెస్ట్​ పోస్ట్​మ్యాన్​గా పురుషోత్తం​ - కాచీగూడ పోస్ట్​ఆఫీస్​ తాజా వార్త

ఒకనాడు సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి అందజేయడంలో వెలుగొందిన తపాలా వ్యవస్థ ఈనాడు వెలవెలబోతోంది. కానీ ఇప్పటికీ కొన్ని కార్యకలాపాలు దాని ద్వారానే జరుగుతున్నాయి. కాగా ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలోనూ తన విధుల్ని నిరాటంకంగా నిర్వహిస్తూ ఉత్తమ పనితీరు కనపర్చిన ఓ పోస్ట్​మ్యాన్​ సేవలను ప్రభుత్వం గుర్తించింది. అతన్ని బెస్ట్​ పోస్ట్​మ్యాన్​గా ప్రకటిస్తూ అవార్డును అందజేసింది. మరి అతనెవరో అతని వివరాలేంటో తెలుసుకుందామా..

best-postman-awardee-purushotham-from-kachiguda-in-hyderabad
కరోనా కాలంలో ఉత్తమ పనితీరు.. బెస్ట్​ పోస్ట్​మ్యాన్​గా పురుషోత్తం​
author img

By

Published : Oct 31, 2020, 10:21 AM IST

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగి సమాచార మార్పిడి శరవేగంగా జరిగిపోతోంది. ఎన్నో రకాల ప్రసారమాధ్యమాలు అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అందరికీ చేరిపోతుంది. కానీ ఒకప్పుడు ప్రతీది పోస్ట్​మ్యాన్ తెచ్చిచ్చే కార్డు ముక్క ద్వారానే ఒకరి విషయాలు ఒకరికి తెలిసేది.

best-postman-awardee-purushotham-from-kachiguda-in-hyderabad
కరోనా కాలంలో ఉత్తమ పనితీరు.. బెస్ట్​ పోస్ట్​మ్యాన్​గా పురుషోత్తం​

అయితే ఇప్పటికీ కొన్ని కార్యకలాపాలు పోస్ట్​ల ద్వారానే జరుగుతుంటాయి. కాగా ప్రస్తుతం కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా పోస్ట్​మ్యాన్​లు తమ సేవలను అందించారు. వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ పరిధిలోగల కాచిగూడ పోస్ట్​మ్యాన్ చేగురి పురుషోత్తం బెస్తను 'బెస్ట్ పోస్ట్​మ్యాన్'గా ప్రకటిస్తూ సౌత్ ఈస్ట్ డివిజన్ సూపరింటెండెంట్ అతనికి అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి: బ్యాంకుల తరహాలో తపాలా సేవలు.. ఆర్‌బీఐ అనుమతి కోరిన పోస్టల్‌శాఖ

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగి సమాచార మార్పిడి శరవేగంగా జరిగిపోతోంది. ఎన్నో రకాల ప్రసారమాధ్యమాలు అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అందరికీ చేరిపోతుంది. కానీ ఒకప్పుడు ప్రతీది పోస్ట్​మ్యాన్ తెచ్చిచ్చే కార్డు ముక్క ద్వారానే ఒకరి విషయాలు ఒకరికి తెలిసేది.

best-postman-awardee-purushotham-from-kachiguda-in-hyderabad
కరోనా కాలంలో ఉత్తమ పనితీరు.. బెస్ట్​ పోస్ట్​మ్యాన్​గా పురుషోత్తం​

అయితే ఇప్పటికీ కొన్ని కార్యకలాపాలు పోస్ట్​ల ద్వారానే జరుగుతుంటాయి. కాగా ప్రస్తుతం కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా పోస్ట్​మ్యాన్​లు తమ సేవలను అందించారు. వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ పరిధిలోగల కాచిగూడ పోస్ట్​మ్యాన్ చేగురి పురుషోత్తం బెస్తను 'బెస్ట్ పోస్ట్​మ్యాన్'గా ప్రకటిస్తూ సౌత్ ఈస్ట్ డివిజన్ సూపరింటెండెంట్ అతనికి అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి: బ్యాంకుల తరహాలో తపాలా సేవలు.. ఆర్‌బీఐ అనుమతి కోరిన పోస్టల్‌శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.