ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో దసరాను జరుపుకోవాలి'

author img

By

Published : Oct 10, 2020, 2:16 PM IST

బతుకమ్మ చీరల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.317 కోట్లు కేటాయించిందని.. చీరల తయారీలో 28 వేల నేతన్నల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. శనివారం అమీర్​పేటలోని మహిళలకు మంత్రి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

Bathukamma saree distribution by minister talasani at ameerpet
'ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో దసరాను జరుపుకోవాలి'

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ.. బతుకమ్మ పండుగని.. అలాంటి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. శనివారం హైదరాబాద్​ అమీర్​పేటలోని వివేకానందనగర్​ కమిటీ హాల్​లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే దసరా నవరాత్రుల్లో నిర్వహించే బతుకమ్మ వేడుక కోసం.. బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలను పాటిస్తూనే పండుగను జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ.. బతుకమ్మ పండుగని.. అలాంటి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. శనివారం హైదరాబాద్​ అమీర్​పేటలోని వివేకానందనగర్​ కమిటీ హాల్​లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే దసరా నవరాత్రుల్లో నిర్వహించే బతుకమ్మ వేడుక కోసం.. బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలను పాటిస్తూనే పండుగను జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.