ETV Bharat / state

భైంసాలో సీఎం పర్యటించాలి: బండి సంజయ్​ - సీఎం కేసీఆర్​పై బండి సంజయ్​ వ్యాఖ్యలు

నిర్మల్​ జిల్లా భైంసాలో సీఎం కేసీఆర్​ పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ఒక వర్గం వైపు మాత్రమే ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భైంసాలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

bandi sanjay
బండి సంజయ్​, భైంసా అల్లర్లు
author img

By

Published : Mar 10, 2021, 3:26 PM IST

భైంసా అల్లర్ల బాధితులను భాజపా మాత్రమే మానవత్వంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. ఈ అల్లర్లకు కారణం ఎంఐఎం పార్టీనే అని వెల్లడించారు. భైంసాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపించిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టణంలో పర్యటించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అక్కడ భరోసా యాత్ర చేపడతామని హెచ్చరించారు.

పక్షపాతంగా...

పట్టణంలోని ఆరు ప్రాంతాల్లో ఓ పథకం ప్రకారమే ఏకకాలంలో దాడులు జరిగాయని వెల్లడించారు. ఈ ఘటనలో విజయ్‌, దేవారెడ్డిలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బండి పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఓ వర్గాన్ని వెనుకేసుకొస్తోందని ఆరోపించారు. పేదవాళ్ల ఇళ్లను దుండగులు దగ్ధం చేసినా కూడా సీఎం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భైంసాలో సీఎం పర్యటించాలి: బండి సంజయ్​

ఇదీ చదవండి: భైంసా ఘటనలపై అమిత్​షాకు ఫిర్యాదు చేశాం : అర్వింద్

భైంసా అల్లర్ల బాధితులను భాజపా మాత్రమే మానవత్వంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. ఈ అల్లర్లకు కారణం ఎంఐఎం పార్టీనే అని వెల్లడించారు. భైంసాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపించిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టణంలో పర్యటించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అక్కడ భరోసా యాత్ర చేపడతామని హెచ్చరించారు.

పక్షపాతంగా...

పట్టణంలోని ఆరు ప్రాంతాల్లో ఓ పథకం ప్రకారమే ఏకకాలంలో దాడులు జరిగాయని వెల్లడించారు. ఈ ఘటనలో విజయ్‌, దేవారెడ్డిలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బండి పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఓ వర్గాన్ని వెనుకేసుకొస్తోందని ఆరోపించారు. పేదవాళ్ల ఇళ్లను దుండగులు దగ్ధం చేసినా కూడా సీఎం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భైంసాలో సీఎం పర్యటించాలి: బండి సంజయ్​

ఇదీ చదవండి: భైంసా ఘటనలపై అమిత్​షాకు ఫిర్యాదు చేశాం : అర్వింద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.