ETV Bharat / state

Balkampet Yellamma Temple : బల్కంపేట ఎల్లమ్మగుడిలో ఘర్షణ.. ఐదుగురికి కత్తిపోట్లు

Balkampet Yellamma Temple riots : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ ఉత్సవంలో అధికారుల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా.. ఏర్పాట్లలో దేవాదాయశాఖ విఫలమైందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీసులు ప్రముఖుల సేవకే పరిమితమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఎంతోమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. మరో వైపు మందుబాబులు, జేబుదొంగలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆలయ ప్రాంగణంలోని జరిగిన గొడవల్లో ఐదుగురు కత్తిపోట్లకు గురయ్యారు. 200 మంది సెల్‌ఫోన్‌లు పోయాయని ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Jun 22, 2023, 11:56 AM IST

Balkampet Yellamma
Balkampet Yellamma

Balkampet Yellamma Temple Clash : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి లక్షల్లో భక్తులు తరలివచ్చారు. పిల్లలు, మహిళలు, వయోధికులు అందర్నీ ఒకే వరుస కేటాయించడంతో సమస్య మొదలైంది. ఈ క్రమంలోనే ఎండ తీవ్రతకు భక్తులు తాళలేకపోయారు. మరోవైపు వీఐపీ పాసులు అధికంగా జారీ చేశారు. ఇదంతా శాఖల సమన్వయలోపంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇష్టానుసారం వీఐపీ పాసులు జారీ చేయటం.. ఊహించని విధంగా లక్షలాది మంది తరలిరావటంతో పోలీసులు నియంత్రించలేకపోయారు.

ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అధికారుల మధ్య అంతర్గత గొడవలతో.. ఎవరకివారే అన్నట్టుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. బోనాల కాంప్లెక్స్‌లో అన్నదానం వద్దంటూ పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టారు. మంగళవారం రాత్రి వేలాది మంది భక్తులు ఆలయ సమీపంలోని బోనాల కాంప్లెక్స్‌లో విడిది చేశారు. ఉదయం నుంచి అక్కడే తిష్టవేసిన మందుబాబులు, పాతనేరస్తులు.. అర్ధరాత్రి దాటాక హడావుడి చేశారు. మత్తులో భక్తులను బెంబేలెత్తించారు.

  • Attacked with a knife for refusing love: ప్రేమను నిరాకరించిందనే కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి

Attacks on Five People in Balkampet Yellamma Temple : పోలీసుల బందోబస్తు నామమాత్రంగా ఉండటంతో మరింతగా రెచ్చిపోయారు. మూడు జట్లుగా మారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఎల్లారెడ్డిగూడకు చెందిన కార్తిక్‌రాజ్‌ మిత్రులతో మంగళవారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో కార్తిక్, శుభమ్‌పై దాడి చేశారు. దాడిలో గాయపడిన కార్తిక్‌ను ఆసుపత్రిలో చేర్చారు. క్రిస్టల్‌ హోటల్‌ వద్ద రాత్రి జరిగిన మరో ఘటనలో విశాల్, విష్ణు సోదరులపై పాతకక్షలతో.. యశ్వంత్, సూర్య కత్తులతో దాడి చేసి గాయపరిచారు.

Balkampet Yellamma Temple : అర్ధరాత్రి దాటాక సాయికుమార్‌ అతడి మిత్రులపై.. బోనాల కాంప్లెక్స్‌ వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి కడుపుపై భాగంలో బలమైన గాయం కావటంతో.. సోమాజీగూడలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి ఆరోగ్యపరిసితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ దాడులకు అమీర్‌పేట్‌కు చెందిన పాత నేరస్తుడు సంజుసింగ్‌ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ స్నాచింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఇతడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాతనేరస్తుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచకపోవటమే దాడులకు కారణమని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పోలీసుల వైఫల్యం ఉన్నట్టు గుర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు ప్రాంగణంలో భక్తుల మధ్య తొక్కిసలాట, జేబుదొంగల చేతివాటంతో వందలాది మంది సెల్‌ఫోన్లు మాయమయ్యాయి. పెద్దఎత్తున భక్తుల చేరటంతో వారి మధ్య చేరిన దొంగల ఫోన్లు కొట్టేశారు. మరికొందరి ఫోన్లు తొక్కిసలాట సమయంలో కిందపడి పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 200కు పైగా చరవాణులు పోయినట్టు సమాచారం.

ఇవీ చదవండి:

Balkampet Yellamma Temple Clash : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి లక్షల్లో భక్తులు తరలివచ్చారు. పిల్లలు, మహిళలు, వయోధికులు అందర్నీ ఒకే వరుస కేటాయించడంతో సమస్య మొదలైంది. ఈ క్రమంలోనే ఎండ తీవ్రతకు భక్తులు తాళలేకపోయారు. మరోవైపు వీఐపీ పాసులు అధికంగా జారీ చేశారు. ఇదంతా శాఖల సమన్వయలోపంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇష్టానుసారం వీఐపీ పాసులు జారీ చేయటం.. ఊహించని విధంగా లక్షలాది మంది తరలిరావటంతో పోలీసులు నియంత్రించలేకపోయారు.

ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అధికారుల మధ్య అంతర్గత గొడవలతో.. ఎవరకివారే అన్నట్టుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. బోనాల కాంప్లెక్స్‌లో అన్నదానం వద్దంటూ పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టారు. మంగళవారం రాత్రి వేలాది మంది భక్తులు ఆలయ సమీపంలోని బోనాల కాంప్లెక్స్‌లో విడిది చేశారు. ఉదయం నుంచి అక్కడే తిష్టవేసిన మందుబాబులు, పాతనేరస్తులు.. అర్ధరాత్రి దాటాక హడావుడి చేశారు. మత్తులో భక్తులను బెంబేలెత్తించారు.

  • Attacked with a knife for refusing love: ప్రేమను నిరాకరించిందనే కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి

Attacks on Five People in Balkampet Yellamma Temple : పోలీసుల బందోబస్తు నామమాత్రంగా ఉండటంతో మరింతగా రెచ్చిపోయారు. మూడు జట్లుగా మారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఎల్లారెడ్డిగూడకు చెందిన కార్తిక్‌రాజ్‌ మిత్రులతో మంగళవారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో కార్తిక్, శుభమ్‌పై దాడి చేశారు. దాడిలో గాయపడిన కార్తిక్‌ను ఆసుపత్రిలో చేర్చారు. క్రిస్టల్‌ హోటల్‌ వద్ద రాత్రి జరిగిన మరో ఘటనలో విశాల్, విష్ణు సోదరులపై పాతకక్షలతో.. యశ్వంత్, సూర్య కత్తులతో దాడి చేసి గాయపరిచారు.

Balkampet Yellamma Temple : అర్ధరాత్రి దాటాక సాయికుమార్‌ అతడి మిత్రులపై.. బోనాల కాంప్లెక్స్‌ వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి కడుపుపై భాగంలో బలమైన గాయం కావటంతో.. సోమాజీగూడలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి ఆరోగ్యపరిసితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ దాడులకు అమీర్‌పేట్‌కు చెందిన పాత నేరస్తుడు సంజుసింగ్‌ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ స్నాచింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఇతడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాతనేరస్తుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచకపోవటమే దాడులకు కారణమని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పోలీసుల వైఫల్యం ఉన్నట్టు గుర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు ప్రాంగణంలో భక్తుల మధ్య తొక్కిసలాట, జేబుదొంగల చేతివాటంతో వందలాది మంది సెల్‌ఫోన్లు మాయమయ్యాయి. పెద్దఎత్తున భక్తుల చేరటంతో వారి మధ్య చేరిన దొంగల ఫోన్లు కొట్టేశారు. మరికొందరి ఫోన్లు తొక్కిసలాట సమయంలో కిందపడి పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 200కు పైగా చరవాణులు పోయినట్టు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.