ETV Bharat / state

వాడవాడన హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు

అయోధ్యలో రామమందిరం భూమి పూజ విజయవంతం కావడం వల్ల హైదరాబాద్ లో వాడవాడలో సంబరాలు హోరెత్తాయి. యువకులు టపాసులు కాలుస్తూ జై శ్రీరామ్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

author img

By

Published : Aug 5, 2020, 2:46 PM IST

వాడవాడన హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు
వాడవాడన హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు

అయోధ్యలో రామమందిరం భూమి పూజ విజయవంతం కావడం వల్ల హైదరాబాద్ లో వాడవాడలో సంబరాలు హోరెత్తాయి. ఖైరతాబాద్ లోని వీర హనుమాన్ మందిరం నిర్వాహకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... అనంతరం 21 మందితో 3 గంటల పాటు శ్రీరామ నామ స్మరణ జపం చేశారు.

యువకులు టపాసులు కాలుస్తూ జై శ్రీరామ్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి జఠిలంగా ఉన్న సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించి... అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కరోనా మహమ్మరిని పారదోలాలని హనుమాన్ ను వేడుకునట్లు వారు తెలిపారు.

అయోధ్యలో రామమందిరం భూమి పూజ విజయవంతం కావడం వల్ల హైదరాబాద్ లో వాడవాడలో సంబరాలు హోరెత్తాయి. ఖైరతాబాద్ లోని వీర హనుమాన్ మందిరం నిర్వాహకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... అనంతరం 21 మందితో 3 గంటల పాటు శ్రీరామ నామ స్మరణ జపం చేశారు.

యువకులు టపాసులు కాలుస్తూ జై శ్రీరామ్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి జఠిలంగా ఉన్న సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించి... అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కరోనా మహమ్మరిని పారదోలాలని హనుమాన్ ను వేడుకునట్లు వారు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.