ETV Bharat / state

హైదరాబాద్ బాద్​ షా అసదుద్దీన్

author img

By

Published : May 23, 2019, 7:37 PM IST

Updated : May 24, 2019, 9:38 AM IST

హైదరాబాద్ నియోజకవర్గంలో మరోసారి పట్టునిలుపుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ. వరుసగా నాలుగోసారి గెలిచి... పాతబస్తీలో తనకు తిరుగులేదని నిరూపించారు. భాజపా అభ్యర్థి భగవంత్ రావుపై 2లక్షల 78వేల 281ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

asadduddin

హైదరాబాద్​ పార్లమెంట్ స్థానంపై అసదుద్దీన్ మరోసారి జెండా ఎగురవేశారు. వరుసగా నాలుగోసారి విజయ సాధించారు. భాజపా అభ్యర్థి భగవంత్​ రావుపై 2,78,281 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు పారంభమైన తర్వాత ఎంఐఎం, భాజపా మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరికి ఓవైసీ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ఇక్కడి నుంచి ఓవైసీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్, భాజపా తరఫున భగవంత్​ రావు తెరాస నుంచి పుస్తె శ్రీకాంత్ పోటీ చేశారు. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ... ఎంఐఎం, తెరాస మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నందున ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, కమలం పార్టీ మధ్యే ఉంది.

హైదరాబాద్ లోక్​సభలో 1985 నుంచి ఓవైసీ కుటుంబానిదే ఆధిపత్యం. వరుసగా 5 పర్యాయాలు ఎంఐఎం తరఫున సలావుద్దీన్ గెలిచారు. తరువాత ఆయన తనయుడు అసదుద్దీన్ రాజకీయ వారసుడిగా 2004లో పాతబస్తీ బరిలో దిగి... హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇప్పుడు నాలుగోసారి విజయ బావుటా ఎగురవేశారు. నియోజకవర్గ పరిధిలో ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండటం, పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలవడం ఓవైసీకి సానుకూలాంశాలు.

మొదట్నుంచీ తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్... ఎంఐఎం విజయంతో ఒక్కసారిగా కనుమరుగైంది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా మళ్లీ గెలవలేదు. లోక్​సభ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అధిష్ఠానం... నాంపల్లి శాసనసభ అభ్యర్థిగా ఓడిపోయిన ఫిరోజ్​ఖాన్​ను బరిలో దింపింది.

నాలుగుసార్లు రెండో స్థానంలో నిలిచిన భాజపా ఈ సారైనా బోణీ కొట్టేందుకు బరిలో దిగింది. 2014లో 3 లక్షలకుపైగా ఓట్లు సాధించిన భగవంతరావును రెండోసారి పోటీకి దింపింది. ఎంఐఎంతో బలమైన పోటీ ఇచ్చారు. ఈసారి రెండో స్థానంలో నిలిచారు.

16 ఎంపీ స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న తెరాస హైదరాబాద్​ను మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేసింది. స్నేహపూర్వక పోటీలో భాగంగా అభ్యర్థిని పెట్టినా... మిత్రుడు అసదుద్దీన్​ గెలుపు కోసం కృషి చేసింది.

హైదరాబాద్​ పార్లమెంట్ స్థానంపై అసదుద్దీన్ మరోసారి జెండా ఎగురవేశారు. వరుసగా నాలుగోసారి విజయ సాధించారు. భాజపా అభ్యర్థి భగవంత్​ రావుపై 2,78,281 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు పారంభమైన తర్వాత ఎంఐఎం, భాజపా మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరికి ఓవైసీ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ఇక్కడి నుంచి ఓవైసీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్, భాజపా తరఫున భగవంత్​ రావు తెరాస నుంచి పుస్తె శ్రీకాంత్ పోటీ చేశారు. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ... ఎంఐఎం, తెరాస మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నందున ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, కమలం పార్టీ మధ్యే ఉంది.

హైదరాబాద్ లోక్​సభలో 1985 నుంచి ఓవైసీ కుటుంబానిదే ఆధిపత్యం. వరుసగా 5 పర్యాయాలు ఎంఐఎం తరఫున సలావుద్దీన్ గెలిచారు. తరువాత ఆయన తనయుడు అసదుద్దీన్ రాజకీయ వారసుడిగా 2004లో పాతబస్తీ బరిలో దిగి... హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇప్పుడు నాలుగోసారి విజయ బావుటా ఎగురవేశారు. నియోజకవర్గ పరిధిలో ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండటం, పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలవడం ఓవైసీకి సానుకూలాంశాలు.

మొదట్నుంచీ తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్... ఎంఐఎం విజయంతో ఒక్కసారిగా కనుమరుగైంది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా మళ్లీ గెలవలేదు. లోక్​సభ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అధిష్ఠానం... నాంపల్లి శాసనసభ అభ్యర్థిగా ఓడిపోయిన ఫిరోజ్​ఖాన్​ను బరిలో దింపింది.

నాలుగుసార్లు రెండో స్థానంలో నిలిచిన భాజపా ఈ సారైనా బోణీ కొట్టేందుకు బరిలో దిగింది. 2014లో 3 లక్షలకుపైగా ఓట్లు సాధించిన భగవంతరావును రెండోసారి పోటీకి దింపింది. ఎంఐఎంతో బలమైన పోటీ ఇచ్చారు. ఈసారి రెండో స్థానంలో నిలిచారు.

16 ఎంపీ స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న తెరాస హైదరాబాద్​ను మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేసింది. స్నేహపూర్వక పోటీలో భాగంగా అభ్యర్థిని పెట్టినా... మిత్రుడు అసదుద్దీన్​ గెలుపు కోసం కృషి చేసింది.

Intro:Body:Conclusion:
Last Updated : May 24, 2019, 9:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.