ETV Bharat / state

మెయిన్స్​ వాయిదా వేయాలంటూ ఏపీ సీఎంకు విజ్ఞప్తి - ap updates

మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఎం జగన్​ను గ్రూప్​-1 అభ్యర్థులు కోరారు. ఈ నెల 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తే తాము పూర్తిస్థాయిలో సిద్ధం కాలేమని విజ్ఞప్తి చేశారు. పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని విన్నవించారు.

appsc-group1-candidates-request-to ap-cm-jagan-over-mains-exams-dates
మెయిన్స్​ వాయిదా వేయాలంటూ ఏపీ సీఎంకు విజ్ఞప్తి
author img

By

Published : Dec 5, 2020, 7:52 PM IST

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఎం జగన్​ను గ్రూపు-1 అభ్యర్థులు కోరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులు స్పందనలో విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ కు 1378 మంది అభ్యర్థులం అర్హత పొందామని.. డిసెంబర్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తే తాము సిద్ధం కాలేమని తెలిపారు.

అదేరోజు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ నియామక పరీక్షలు ఉన్నాయని వివరించారు. వీటిలో యూపీఎస్సీ, రైల్వే, స్టాఫ్ సెలక్షన్, ఏపీసెట్ పరీక్షలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మెయిన్స్​ పరీక్షలను 3 నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవించారు.

ఇదీ చూడండి:నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: సీపీఐ

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఎం జగన్​ను గ్రూపు-1 అభ్యర్థులు కోరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులు స్పందనలో విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ కు 1378 మంది అభ్యర్థులం అర్హత పొందామని.. డిసెంబర్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తే తాము సిద్ధం కాలేమని తెలిపారు.

అదేరోజు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ నియామక పరీక్షలు ఉన్నాయని వివరించారు. వీటిలో యూపీఎస్సీ, రైల్వే, స్టాఫ్ సెలక్షన్, ఏపీసెట్ పరీక్షలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మెయిన్స్​ పరీక్షలను 3 నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు విన్నవించారు.

ఇదీ చూడండి:నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: సీపీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.