ETV Bharat / state

ఆధార్​ కార్డుల జారీలో వెనుకపడ్డ తెలంగాణ

తపాలా శాఖ ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండగా... తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడింది. రోజుకు జాతీయ సగటు అయిదు ఆధార్‌కార్డులు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 18 కార్డులు జారీ చేస్తున్నట్లు యుఐడీఏఐ లెక్కలు చెబుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం అత్యంత తక్కువగా రోజుకు దాదాపు రెండు కార్డులు జారీ చేస్తున్నట్లు ఆధార్‌ సంస్థ వెల్లడిస్తోంది.

author img

By

Published : Sep 2, 2019, 8:38 PM IST

adhar card
ఆధార్​ కార్డుల జారీలో వెనుకపడ్డ తెలంగాణ

ఆధార్‌ కార్డుల జారీ, సవరణలు నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగడం వల్ల కార్డుదారుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన కేంద్రం... ప్రభుత్వ సంస్థల ద్వారానే ఆ కార్యక్రమం నిర్వహించేందుకు దశల వారీగా మార్పు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఇలా రకరకాల ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసింది యూనిక్యూ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఇండియా-యుఐడీఏఐ.

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం బ్యాంకుల్లో పదిశాతం, తపాలా కార్యాలయాల్లో పది శాతం ఆధార్‌ కార్డుల జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా పోస్టల్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆధార్‌ జారీపై శిక్షణ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 14,366 తపాలా కార్యాలయాల ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ ఏర్పాటు కాగా... అందులో 10,668లో మాత్రమే అమలవుతోంది. మిగిలిన వాటిలో వివిధ రకాల సాంకేతిక సమస్యల కారణంగా పని చేయకపోవడం వల్ల వాటిని కూడా పునరుద్ధరణ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తపాలా కార్యాలయాల ద్వారా కొత్త కార్డుల జారీ, సవరణలు మొత్తం కలిపి ప్రతి నెల 13లక్షల 66వేల నుంచి 15 లక్షల వరకు జారీ అవుతాయని యుఐడీఏఐ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒక్కో తపాలా కార్యాలయం నుంచి రోజుకు సగటున అయిదు కార్డులు మాత్రమే జారీ అవుతున్నట్లు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్​ మెుదటి స్థానం...జమ్ముకశ్మీర్​ చివరి స్థానం

రాష్ట్రాల వారీగా తపాలా కార్యాలయాల ద్వారా ప్రతి నెల జారీ అవుతున్న కార్డుల తీరును పరిశీలించినట్లయితే మెుదటి రెండు స్థానాలను ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ రాష్ట్రాలు దక్కించుకున్నాయి. చివరిస్థానంలో జమ్ముకశ్మీర్​ నిలిచింది. మిగిలిన రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా కర్ణాటక, మధ్యప్రదేశ్‌, అసోం, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయి. జాతీయ సగటు కంటే తక్కువ నమోదు చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. కొందరు అధికారులు తగిన శ్రద్ధ కనపరచకపోవడం వల్ల రాష్ట్రంలో ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోందని యుఐడీఏఐ పేర్కొంది.

రాష్ట్రం తపాలా కార్యాలయాల సంఖ్య జారీ చేసిన ఆధార్​ కార్డుల సంఖ్య(నెలకు) స్థానం
ఆంధ్రప్రదేశ్​ 518 రెండు లక్షల 32వేలకు పైగా 1
దిల్లీ 168 56వేలకుపైగా 2
ఉత్తర్​ప్రదేశ్​​ 1205 3లక్షల 32వేల వరకు 3

ఇవీచూడండి:రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో దత్తాత్రేయ భేటీ

ఆధార్​ కార్డుల జారీలో వెనుకపడ్డ తెలంగాణ

ఆధార్‌ కార్డుల జారీ, సవరణలు నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగడం వల్ల కార్డుదారుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన కేంద్రం... ప్రభుత్వ సంస్థల ద్వారానే ఆ కార్యక్రమం నిర్వహించేందుకు దశల వారీగా మార్పు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఇలా రకరకాల ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసింది యూనిక్యూ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఇండియా-యుఐడీఏఐ.

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం బ్యాంకుల్లో పదిశాతం, తపాలా కార్యాలయాల్లో పది శాతం ఆధార్‌ కార్డుల జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా పోస్టల్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆధార్‌ జారీపై శిక్షణ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 14,366 తపాలా కార్యాలయాల ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ ఏర్పాటు కాగా... అందులో 10,668లో మాత్రమే అమలవుతోంది. మిగిలిన వాటిలో వివిధ రకాల సాంకేతిక సమస్యల కారణంగా పని చేయకపోవడం వల్ల వాటిని కూడా పునరుద్ధరణ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తపాలా కార్యాలయాల ద్వారా కొత్త కార్డుల జారీ, సవరణలు మొత్తం కలిపి ప్రతి నెల 13లక్షల 66వేల నుంచి 15 లక్షల వరకు జారీ అవుతాయని యుఐడీఏఐ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒక్కో తపాలా కార్యాలయం నుంచి రోజుకు సగటున అయిదు కార్డులు మాత్రమే జారీ అవుతున్నట్లు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్​ మెుదటి స్థానం...జమ్ముకశ్మీర్​ చివరి స్థానం

రాష్ట్రాల వారీగా తపాలా కార్యాలయాల ద్వారా ప్రతి నెల జారీ అవుతున్న కార్డుల తీరును పరిశీలించినట్లయితే మెుదటి రెండు స్థానాలను ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ రాష్ట్రాలు దక్కించుకున్నాయి. చివరిస్థానంలో జమ్ముకశ్మీర్​ నిలిచింది. మిగిలిన రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా కర్ణాటక, మధ్యప్రదేశ్‌, అసోం, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయి. జాతీయ సగటు కంటే తక్కువ నమోదు చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. కొందరు అధికారులు తగిన శ్రద్ధ కనపరచకపోవడం వల్ల రాష్ట్రంలో ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోందని యుఐడీఏఐ పేర్కొంది.

రాష్ట్రం తపాలా కార్యాలయాల సంఖ్య జారీ చేసిన ఆధార్​ కార్డుల సంఖ్య(నెలకు) స్థానం
ఆంధ్రప్రదేశ్​ 518 రెండు లక్షల 32వేలకు పైగా 1
దిల్లీ 168 56వేలకుపైగా 2
ఉత్తర్​ప్రదేశ్​​ 1205 3లక్షల 32వేల వరకు 3

ఇవీచూడండి:రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో దత్తాత్రేయ భేటీ

TG_HYD_26_02_AP_TOP_MOST_IN_ADHAR_ISSUE_PKG_3038066 Reporter: Tirupal Reddy ()తపాలా శాఖ ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడింది. రోజుకు జాతీయ సగటు అయిదు ఆధార్‌కార్డులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 18 కార్డులు జారీ చేస్తున్నట్లు యుఐడిఏఐ లెక్కలు చెబుతున్నాయి. జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రం అత్యంత తక్కువగా రోజుకు దాదాపు రెండు కార్డులు జారీ చేస్తున్నట్లు ఆధార్‌ సంస్థ వెల్లడిస్తోంది. LOOK వాయిస్ఓవర్‌1: ఆధార్‌ కార్డుల జారీ, సవరణల ప్రక్రియ నిరంతరం జరగాల్సి ఉంది. ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగడం వల్ల కార్డుదారుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన కేంద్రం ప్రభుత్వ సంస్థల ద్వారానే ఆ కార్యక్రమం నిర్వహించేందుకు దశల వారీగా మార్పు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఇలా రకరకాల ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసింది యూనిక్యూ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఇండియా-యుఐడిఎఐ. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం బ్యాంకుల్లో పదిశాతం, తపాలాకార్యాలయాల్లో పది శాతం ఆదార్‌ కార్డుల జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా పోస్టల్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆధార్‌ జారీపై శిక్షణ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 14,366 తపాలా కార్యాలయాల ద్వారా ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ ఏర్పాటు కాగా అందులో 10,668లో మాత్రమే అమలవుతోంది. మిగిలిన వాటిలో వివిధ రకాల సాంకేతిక సమస్యల కారణంగా పని చేయకపోవడంతో వాటిని కూడా పునరుద్దరణ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తపాలా కార్యాలయాల ద్వారా అటు కొత్త కార్డుల జారీ, సవరణలు మొత్తం కలిపి ప్రతి నెల 13లక్షల 66వేల నుంచి 15 లక్షల వరకు జారీ అవుతాయని యుఐడిఎఐ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒక్కో తపాలా కార్యాలయం నుంచి రోజుకు సగటున అయిదు కార్డులు మాత్రమే జారీ అవుతున్నట్లు స్పష్టం చేసింది. వాయిస్ఓవర్‌2: రాష్ట్రాల వారీగా తపాలా కార్యాలయాల ద్వారా ప్రతి నెల జారీ అవుతున్న కార్డుల తీరును పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 518 పోస్టాఫీసుల ద్వారా రెండు లక్షల 32వేలకుపైగా కార్డులు జారీ చేసి 17.93శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ రాజధాని దిల్లీ 168 తపాలా కార్యాలయాల ద్వారా నెలకు 56వేలకుపైగా ఆధార్‌ కార్డులను జారీ చేసి 13.38శాతంతో రెండో స్థానంలో ఉండగా ఉత్తర్‌ప్రదేశ్‌ 1205 పోస్టాఫీసుల ద్వారా 3లక్షల 32వేల వరకు ఆధార్‌ కార్డులు జారీ చేసి సగటున 11.02శాతంతో మూడో స్థానంలో నిలిచింది. జమ్ము కశ్మీర్‌ అత్యంత తక్కువగా 22 పోస్టాఫీసుల ద్వారా 913 ఆధార్‌ కార్డులు జారీ చేసి కేవలం 1.66శాతం నమోదు చేసిన రాష్ట్రంగా నిలచింది. మిగిలిన రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా కర్ణాటక, మధ్యప్రదేశ్‌, అస్సాం, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, మేఘాలయ రాష్ట్రాలు ఉన్నాయి. జాతీయ సగటు కంటే తక్కువ నమోదు చేసుకున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. కొందరు అధికారులు తగిన శ్రద్ద కనపరచకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోందని యుఐడిఎఐ పేర్కొంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.