ETV Bharat / state

ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Jan 9, 2021, 7:38 PM IST

ఏపీలో కొత్తగా 199 మంది కరోనా బారిన పడ్డారని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 423 మందికి కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. తాజా కేసులతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,84,689కి చేరింది.

ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు.. ఒకరు మృతి

గత 24 గంటల్లో 50,445 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి వైరస్ సోకినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 423 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 35 మంది.. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. చిత్తూరులో 23, విశాఖపట్నం 21, తూర్పు గోదావరి 20, అనంతపురం 15, పశ్చిమ గోదావరి 14, కర్నూలు 12, నెల్లూరు 11, కడపలో 7 చొప్పున కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు ఏపీలో 1,22,74,647 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజా కేసులతో కలిపి 8,84,689 మందికి కొవిడ్ సోకింది. 8,74,954 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 2,607 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,128 మంది మహమ్మారి వల్ల మరణించారు.

ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఇదీ చదవండి: 'అభివృద్ధికి కాదు... ఆ పేరుతో జరిగే దోపిడీకి వ్యతిరేకం'

గత 24 గంటల్లో 50,445 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి వైరస్ సోకినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 423 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 35 మంది.. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. చిత్తూరులో 23, విశాఖపట్నం 21, తూర్పు గోదావరి 20, అనంతపురం 15, పశ్చిమ గోదావరి 14, కర్నూలు 12, నెల్లూరు 11, కడపలో 7 చొప్పున కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు ఏపీలో 1,22,74,647 మందికి కరోనా పరీక్షలు చేయగా.. తాజా కేసులతో కలిపి 8,84,689 మందికి కొవిడ్ సోకింది. 8,74,954 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 2,607 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,128 మంది మహమ్మారి వల్ల మరణించారు.

ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కొత్తగా 199 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఇదీ చదవండి: 'అభివృద్ధికి కాదు... ఆ పేరుతో జరిగే దోపిడీకి వ్యతిరేకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.