దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అవమానిస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన నిర్భయ న్యాయవాదులను వెంటనే డిస్మిస్ చేయాలని అఖిల భారతీయ జన్సంఘ్ డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. న్యాయ పరిధిలో దాదాపు 8 ఏళ్లుగా విచారణ జరిగి... ఇప్పుడు శిక్ష పడితే ఎందుకు అడ్డుకుంటున్నారని అఖిల భారతీయ జన్సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. వీరు ఏమైనా దేశభక్తులా? లేకపోతే సంఘసేవకులా? ఎందుకు వారిని కాపాడాలని అరాటపడుతున్నారని నిలదీశారు.
'నిర్భయ దోషులెమైనా దేశ భక్తులా.. ఎందుకు కాపాడుతున్నారు'
నిర్భయ దోషుల కేసు విషయంలో దోషుల తరఫు న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై అఖిల భారత జన్సంఘ్ మండిపడింది.
!['నిర్భయ దోషులెమైనా దేశ భక్తులా.. ఎందుకు కాపాడుతున్నారు' Akhila bharatha jan sangh on nirbhaya victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6456880-128-6456880-1584539243977.jpg?imwidth=3840)
ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, న్యాయశాఖ మంత్రికి, అఖిల భారతీయ బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిర్భయ న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.
ఇదీ చదవండిః గుట్టు వీడింది... కరోనా వైరస్ పుట్టింది అలానే...
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అవమానిస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన నిర్భయ న్యాయవాదులను వెంటనే డిస్మిస్ చేయాలని అఖిల భారతీయ జన్సంఘ్ డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. న్యాయ పరిధిలో దాదాపు 8 ఏళ్లుగా విచారణ జరిగి... ఇప్పుడు శిక్ష పడితే ఎందుకు అడ్డుకుంటున్నారని అఖిల భారతీయ జన్సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్కుమార్ మండిపడ్డారు. వీరు ఏమైనా దేశభక్తులా? లేకపోతే సంఘసేవకులా? ఎందుకు వారిని కాపాడాలని అరాటపడుతున్నారని నిలదీశారు.
ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, న్యాయశాఖ మంత్రికి, అఖిల భారతీయ బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిర్భయ న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.
ఇదీ చదవండిః గుట్టు వీడింది... కరోనా వైరస్ పుట్టింది అలానే...