ETV Bharat / state

AGRIGOLD: 'బతుకు భారమైంది.. డబ్బులు ఇప్పించండి'.. హైకోర్టుకు అగ్రిగోల్డ్​ బాధితుడు

'అగ్రిగోల్డ్​లో రూ.26.4లక్షలు డిపాజిట్​ చేశాను.. ఆరేళ్లయినా నగదు తిరిగి రాలేదు'.. తన నగదు వాపసు వచ్చేలా చూడాలని కోరుతూ 72 ఏళ్ల రవికాంత్​ సిన్హా హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. క్యాన్సర్‌ బారినపడిన తన భార్యకు.. నగదు లేక వైద్యం చేయించలేకపోవడంతో ఆమె చనిపోయిందని, కుమారుడు వేరుగా ఉంటున్నారని.. ప్రస్తుతం తన జీవనం కష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

author img

By

Published : Oct 3, 2021, 11:07 AM IST

AGRIGOLD CASE IN TELANGANA HIGH COURT
AGRIGOLD CASE IN TELANGANA HIGH COURT

‘పదవీ విరమణ అనంతరం వచ్చిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో దాచుకున్నా. ఆ కంపెనీ మోసం చేయడంతో.. ఆస్తులను ప్రభుత్వం సీజ్‌ చేసి వేలం వేసింది. వచ్చిన సొమ్మును హైకోర్టులో డిపాజిట్‌ చేసింది. అందులో నుంచి నా సొమ్మును వాపసు ఇప్పించేలా ఆదేశాలివ్వండి'’అని కోరుతూ 72 ఏళ్ల రవికాంత్‌సిన్హా అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రూ.26.4 లక్షలు డిపాజిట్‌ చేశానని, 6 ఏళ్లయినా సొమ్ము వాపసు ఇవ్వలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

క్యాన్సర్‌ బారినపడిన తన భార్యకు.. నగదు లేక వైద్యం చేయించలేకపోవడంతో ఆమె చనిపోయిందని, కుమారుడు వేరుగా ఉంటున్నారని, వృద్ధాప్యంలో జీవనం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులు తెలంగాణలోనూ ఉన్నారని, సంస్థకు చెందిన ఇక్కడి ఆస్తులను విక్రయించగా వచ్చిన సొమ్ము హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద డిపాజిట్‌ చేశారని చెప్పారు. ఆ మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అక్కడి డిపాజిట్‌దారులకు చెల్లించిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అగ్రిగోల్డ్‌పై ఇతర పిటిషన్లతో పాటు దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని పేర్కొంది.

మరో పిటిషన్​..

హైదరాబాద్‌ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్‌కు చెందిన భవనాన్ని వేలం వేయగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ నిరాకరిస్తున్నారని బ్యాంకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ భవనాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిందని సబ్‌రిజిస్ట్రార్‌ చెబుతున్నట్లు పేర్కొంది.

బాధితులకు నగదు చెల్లించిన ఏపీ సర్కార్​..

అగ్రిగోల్డ్ బాధితులకు.. ఏపీ ప్రభుత్వం నగదును తిరిగి చెల్లించింది. 3 లక్షల 14 వేల మంది బాధితులకు.. 459 కోట్ల 23 లక్షల రూపాయలను.. వారి ఖాతాల్లో డిపాజిట్ చేసింది. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి చిన్న వ్యాపారులు ఎంతో నష్టపోయారన్న ఏపీ సీఎం జగన్​.. ఓ మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసిందని.. బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. అగ్రిగోల్డ్​లో ఎంతో కష్టపడి పొదుపు చేసిన వారు మోసపోయారన్న సీఎం జగన్​.. రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి 2019 నవంబర్​లోనే రూ. 238.73 కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన 3.86 లక్షల మంది డిపాజిటర్లకు 207.61 కోట్లు తాజాగా చెల్లించినట్లు చెప్పారు.

ఇదీచూడండి: TELUGU ACADEMY SCAM: పక్కా ప్రణాళికతోనే తెలుగు అకాడమీ నిధుల గోల్​మాల్​

‘పదవీ విరమణ అనంతరం వచ్చిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో దాచుకున్నా. ఆ కంపెనీ మోసం చేయడంతో.. ఆస్తులను ప్రభుత్వం సీజ్‌ చేసి వేలం వేసింది. వచ్చిన సొమ్మును హైకోర్టులో డిపాజిట్‌ చేసింది. అందులో నుంచి నా సొమ్మును వాపసు ఇప్పించేలా ఆదేశాలివ్వండి'’అని కోరుతూ 72 ఏళ్ల రవికాంత్‌సిన్హా అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రూ.26.4 లక్షలు డిపాజిట్‌ చేశానని, 6 ఏళ్లయినా సొమ్ము వాపసు ఇవ్వలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

క్యాన్సర్‌ బారినపడిన తన భార్యకు.. నగదు లేక వైద్యం చేయించలేకపోవడంతో ఆమె చనిపోయిందని, కుమారుడు వేరుగా ఉంటున్నారని, వృద్ధాప్యంలో జీవనం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులు తెలంగాణలోనూ ఉన్నారని, సంస్థకు చెందిన ఇక్కడి ఆస్తులను విక్రయించగా వచ్చిన సొమ్ము హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద డిపాజిట్‌ చేశారని చెప్పారు. ఆ మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అక్కడి డిపాజిట్‌దారులకు చెల్లించిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అగ్రిగోల్డ్‌పై ఇతర పిటిషన్లతో పాటు దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని పేర్కొంది.

మరో పిటిషన్​..

హైదరాబాద్‌ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్‌కు చెందిన భవనాన్ని వేలం వేయగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ నిరాకరిస్తున్నారని బ్యాంకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ భవనాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిందని సబ్‌రిజిస్ట్రార్‌ చెబుతున్నట్లు పేర్కొంది.

బాధితులకు నగదు చెల్లించిన ఏపీ సర్కార్​..

అగ్రిగోల్డ్ బాధితులకు.. ఏపీ ప్రభుత్వం నగదును తిరిగి చెల్లించింది. 3 లక్షల 14 వేల మంది బాధితులకు.. 459 కోట్ల 23 లక్షల రూపాయలను.. వారి ఖాతాల్లో డిపాజిట్ చేసింది. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి చిన్న వ్యాపారులు ఎంతో నష్టపోయారన్న ఏపీ సీఎం జగన్​.. ఓ మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసిందని.. బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. అగ్రిగోల్డ్​లో ఎంతో కష్టపడి పొదుపు చేసిన వారు మోసపోయారన్న సీఎం జగన్​.. రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి 2019 నవంబర్​లోనే రూ. 238.73 కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన 3.86 లక్షల మంది డిపాజిటర్లకు 207.61 కోట్లు తాజాగా చెల్లించినట్లు చెప్పారు.

ఇదీచూడండి: TELUGU ACADEMY SCAM: పక్కా ప్రణాళికతోనే తెలుగు అకాడమీ నిధుల గోల్​మాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.