రాష్ట్రంలోని 590 తహసీల్దార్ కార్యాలయాలకు అదనపు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దసరా నుంచి ధరణి వెబ్సైట్ ప్రారంభం అవుతుండడం, వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లు చేయాల్సిన నేపథ్యంలో ఆన్లైన్ సేవలకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఉండేలా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది.
తహసీల్దార్ కార్యాలయాలకు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ద్వారా 12 ఎంబీపీఎస్ సామర్థ్యం కలిగిన నెట్వర్క్ సదుపాయం ఉంది. దానికి అదనంగా మరో ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించిన సర్కారు... స్థానికంగా ఉన్న మంచి నెట్వర్క్ కనెక్షన్ తీసుకోవాలని ఎమ్మార్వోలకు అనుమతించింది. నెలకు 2000 రూపాయలకు మించకుండా కనెక్షన్ తీసుకోవాలని చెప్తూ ఐటీశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది.
ఇదీ చూడండి: కొవిడ్, వైద్యశాఖలోని కీలక అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ