ETV Bharat / state

పాపం పండింది.. శిక్ష పడింది - మాజీ ప్రభుత్వాధికారులకు జైలు శిక్ష

పాపం పండింది.. మాజీ సైనికుల పింఛన్‌ను చేజిక్కించుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులకు సహకరించిన ఖజానా కార్యాలయ మాజీ అధికారులకు జైలుశిక్ష పడింది. ఎం.ఎ.సలాం, నారాయణ, చంద్రయ్య, రామచంద్రయ్య అనే వీరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5500 చొప్పున జరిమానా విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టుల ప్రిన్సిపల్‌, స్పెషల్‌ జడ్జి సాంబశివరావు నాయుడు తీర్పిచ్చారు.

pension scam
పాపం పండింది.. శిక్ష పడింది
author img

By

Published : Jan 7, 2020, 4:21 PM IST

పాట్నాకు చెందిన పార్శీనాథ్‌సింగ్‌ ముఠా 20 ఏళ్ల క్రితం ఈ ఘరానా నేరానికి పాల్పడింది. ముఠా సభ్యులు ఇచ్చిన లంచం తీసుకుని వారికి సహకరించారంటూ సీఐడీ అధికారులు సంగారెడ్డి ఉపఖజానా అధికారులపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘకాలం విచారించిన ఏసీబీ కోర్టు.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎ.లక్ష్మీమనోజ్ఞ వాదనలు, నిందితుల తరఫు వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధించింది.

మిలటరీ అధికారులమంటూ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం అలహాబాద్‌లోని పింఛన్‌ చెల్లింపుల ప్రధాన కార్యాలయం ద్వారా సొమ్మును సికింద్రాబాద్‌కు పంపుతుంది. అక్కడి నుంచి ఆయా జిల్లాల ఖజానా, ఉపఖజానా కార్యాలయాలకు ఆ సొమ్ము వెళ్లేది. ప్రక్రియలో లొసుగులను గుర్తించిన పార్శీనాథ్‌ ఏడుగురు నేరస్థులతో కలిసి పింఛన్‌ సొమ్మును కొల్లగొట్టేందుకు పథకం రచించాడు. మిలటరీ అధికారులమంటూ నమ్మబలికి సికింద్రాబాద్‌లోని పింఛన్‌ చెల్లింపుల కార్యాలయం నుంచి పింఛన్‌దారుల వివరాలు సేకరించాడు.

పది జిల్లాలు.. రూ.2కోట్లు

పార్శీనాథ్‌ ముఠా సభ్యులకు నకిలీ చిరునామాలు, సైన్యంలో పనిచేసినట్టు గుర్తింపు కార్డులు తయారుచేశాడు. మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, గుంటూరు, చిత్తూరు, నిజామాబాద్‌, కర్నూలు, కడప, అనంతపురం, కరీంనగర్‌ జిల్లాలను ఏడు నెలల వ్యవధిలోనే చుట్టేశారు. మొత్తంగా రూ.2కోట్ల నగదు కొల్లగొట్టారు. పార్శీనాథ్‌ కరీంనగర్‌లో పింఛన్‌ సొమ్ము తీసుకుంటుండగా జిల్లా ఖజానా అధికారులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతగాడు అరెస్టయ్యాకే రూ.రెండు కోట్లు కొల్లగొట్టిన విషయం బహిర్గతమైంది.

అధికారులపై కేసులు

పింఛన్‌ కుంభకోణం పది జిల్లాల్లో ఉండటం వల్ల అప్పటి ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రతి జిల్లాలోనూ ఖజానా కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు పార్శీనాథ్‌ ముఠా లంచం ఇచ్చి పింఛన్‌ సొమ్మును తీసుకున్నట్లు సీఐడీ ఆధారాలు సేకరించారు. పార్శీనాథ్‌ ఇచ్చిన సమాచారంతో బిహార్‌కు వెళ్లగా ఏడుగురిలో శంభునాథ్‌ పాండే మాత్రమే దొరికాడు. అనంతరం ఈ కుంభకోణంలో నిందితులుగా ఆయా జిల్లాల్లో అప్పుడు విధులు నిర్వహించిన ప్రభుత్వ అధికారులను చేర్చారు. సంగారెడ్డి ఉపఖజానా అధికారులపై నమోదైన కేసు విచారణ పూర్తికావడంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి: టెక్ కేంద్రంగా ఓరుగల్లు: మంత్రి కేటీఆర్

పాట్నాకు చెందిన పార్శీనాథ్‌సింగ్‌ ముఠా 20 ఏళ్ల క్రితం ఈ ఘరానా నేరానికి పాల్పడింది. ముఠా సభ్యులు ఇచ్చిన లంచం తీసుకుని వారికి సహకరించారంటూ సీఐడీ అధికారులు సంగారెడ్డి ఉపఖజానా అధికారులపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘకాలం విచారించిన ఏసీబీ కోర్టు.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎ.లక్ష్మీమనోజ్ఞ వాదనలు, నిందితుల తరఫు వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధించింది.

మిలటరీ అధికారులమంటూ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం అలహాబాద్‌లోని పింఛన్‌ చెల్లింపుల ప్రధాన కార్యాలయం ద్వారా సొమ్మును సికింద్రాబాద్‌కు పంపుతుంది. అక్కడి నుంచి ఆయా జిల్లాల ఖజానా, ఉపఖజానా కార్యాలయాలకు ఆ సొమ్ము వెళ్లేది. ప్రక్రియలో లొసుగులను గుర్తించిన పార్శీనాథ్‌ ఏడుగురు నేరస్థులతో కలిసి పింఛన్‌ సొమ్మును కొల్లగొట్టేందుకు పథకం రచించాడు. మిలటరీ అధికారులమంటూ నమ్మబలికి సికింద్రాబాద్‌లోని పింఛన్‌ చెల్లింపుల కార్యాలయం నుంచి పింఛన్‌దారుల వివరాలు సేకరించాడు.

పది జిల్లాలు.. రూ.2కోట్లు

పార్శీనాథ్‌ ముఠా సభ్యులకు నకిలీ చిరునామాలు, సైన్యంలో పనిచేసినట్టు గుర్తింపు కార్డులు తయారుచేశాడు. మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, గుంటూరు, చిత్తూరు, నిజామాబాద్‌, కర్నూలు, కడప, అనంతపురం, కరీంనగర్‌ జిల్లాలను ఏడు నెలల వ్యవధిలోనే చుట్టేశారు. మొత్తంగా రూ.2కోట్ల నగదు కొల్లగొట్టారు. పార్శీనాథ్‌ కరీంనగర్‌లో పింఛన్‌ సొమ్ము తీసుకుంటుండగా జిల్లా ఖజానా అధికారులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతగాడు అరెస్టయ్యాకే రూ.రెండు కోట్లు కొల్లగొట్టిన విషయం బహిర్గతమైంది.

అధికారులపై కేసులు

పింఛన్‌ కుంభకోణం పది జిల్లాల్లో ఉండటం వల్ల అప్పటి ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రతి జిల్లాలోనూ ఖజానా కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు పార్శీనాథ్‌ ముఠా లంచం ఇచ్చి పింఛన్‌ సొమ్మును తీసుకున్నట్లు సీఐడీ ఆధారాలు సేకరించారు. పార్శీనాథ్‌ ఇచ్చిన సమాచారంతో బిహార్‌కు వెళ్లగా ఏడుగురిలో శంభునాథ్‌ పాండే మాత్రమే దొరికాడు. అనంతరం ఈ కుంభకోణంలో నిందితులుగా ఆయా జిల్లాల్లో అప్పుడు విధులు నిర్వహించిన ప్రభుత్వ అధికారులను చేర్చారు. సంగారెడ్డి ఉపఖజానా అధికారులపై నమోదైన కేసు విచారణ పూర్తికావడంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి: టెక్ కేంద్రంగా ఓరుగల్లు: మంత్రి కేటీఆర్

TG_HYD_08_07_PENSION_KUMBAKONAM_PKG_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ NOTE: ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు ( ) మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ను పొందేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన అంతరాష్ర్ట ముఠా సభ్యులకు సహాకరించిన నలుగురు మాజీ ఉప ఖజానా కార్యాలయం అధికారులు ఎం.ఎ.సలాం, నారాయణ, చంద్రయ్య, రామచంద్రయ్యలకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఒక్కొక్కరికి 5వేల 5వందల చొప్పున జరిమానా విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టుల ప్రిన్సిపల్‌, స్పెషల్‌ జడ్జి సాంబశివరావు నాయుడు తీర్పు ప్రకటించారు...........LOOK VO.1: పట్నాకు చెందిన పార్శినాథ్‌సింగ్‌ ముఠా 20 ఏళ్ల క్రితం ఈ ఘరానా నేరం చేసింది. పార్శినాథ్‌ ముఠా సభ్యులు ఇచ్చిన లంచం తీసుకుని వారికి సహకరించారంటూ సీఐడీ అధికారులు సంగారెడ్డి ఉపఖజానా అధికారులపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘకాలం విచారించిన ఏసీబీ కోర్టు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎ.లక్ష్మీ మనోజ్ఞ వాదనలు, నిందితుల తరపు వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధించింది.......SPOT VO.2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం అలహాబాద్‌లోని పింఛన్‌ చెల్లింపుల ప్రధాన కార్యాలయం నుంచి పింఛన్‌ సొమ్మును సికింద్రాబాద్‌కు పంపించేది. సికింద్రాబాద్‌ నుంచి ఆయా జిల్లాల ఖజానా, ఉప ఖజనా కార్యాలయాలకు ఆ సొమ్ము వెళ్లేది. అప్పట్లో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడం, లొసుగులను గుర్తించిన పార్శినాథ్‌ తనతో పాటు ఏడుగురు నేరస్థులతో కలిసి పింఛన్‌ సొమ్మును కొల్లగొట్టేందుకు పథకం రచించాడు. సికింద్రాబాద్‌లోని పింఛన్‌ చెల్లింపుల కార్యాలయానికి తన సహచరులతో కలిసి వచ్చాడు. తాము మిలటరీ అధికారులమని, పింఛన్‌ దారుల వివరాలు కావాలంటూ కోరాడు. వారు ఇవ్వగానే పది జిల్లాలను ఎంచుకున్నాడు. తనతో పాటు మరో ఏడుగురికి నకిలీ చిరునామాలు, సైన్యంలో పనిచేసినట్టు గుర్తింపు పత్రాలు తయారు చేశాడు. మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, గుంటూరు, చిత్తూరు, నిజామాబాద్‌, కర్నూలు, కడప, అనంతపురం, కరీంనగర్‌ జిల్లాలకు ఏడు నెలల వ్యవధిలోనే చుట్టేశారు. ఒక్కో జిల్లాల్లో లక్షలతో మొదలు పెట్టి 2 కోట్ల నగదు కొల్లగొట్టారు. పార్శినాథ్‌సింగ్‌ కరీంనగర్‌లో పింఛన్‌ సొమ్ము తీసుకుంటుండగా జిల్లా ఖజానా అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడు అరెస్టయ్యాకే రెండు కోట్లు కొల్లగొట్టారన్న విషయం బహిర్గతమైంది. VO.3: పింఛన్‌ కుంభకోణం పదిజిల్లాల్లో ఉండడంతో అప్పటి ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీఐడీ అధికారులు పరిశోధన చేపట్టారు. ప్రతి జిల్లాలోనూ ఖజానా, ఉపఖజానా కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు పార్శినాథ్‌ ముఠా లంచం ఇచ్చి పింఛన్‌ సొమ్మును తీసుకున్నారని ఆధారాలు సేకరించారు. పార్శినాథ్‌ ఇచ్చిన సమాచారంతో బిహార్‌కు వెళ్లగా ఏడుగురిలో శంభునాథ్‌ పాండే అనే నేరస్థుడు మాత్రమే దొరికాడు. ఈ కుంభకోణంలో నిందితులుగా ఆయా జిల్లాల్లో అప్పుడు విధులు నిర్వహించిన ప్రభుత్వ అధికారులను చేర్చారు. ఈ కేసుల విచారణ కొనసాగుతుండగానే కొందరు అధికారులు పదవీ విరమణ చేశారు. సంగారెడ్డి ఉప ఖజనా అధికారులపై నమోదైన కేసు విచారణ పూర్తవడంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.