ETV Bharat / state

కీసర తహసీల్దార్‌ ఇంట్లో సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం

సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్‌ లంచం కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భూవివాదం పరిష్కారం వ్యవహారంలో ఏకంగా రూ.కోటీ పది లక్షలు లంచం తీసుకుంటుండగా... అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. తహసీల్దార్​తో పాటు ఇద్దరు రియల్టర్లు, వీఆర్వోను అదుపులోకి తీసుకున్న అధికారులు మరింత లోతుగా వారిని విచారిస్తున్నారు.

author img

By

Published : Aug 15, 2020, 5:26 PM IST

acb-rides-on-kesara-mro
అవినీతి తిమింగలం తహశీల్దార్‌ కేసులో మరింత లోతుగా విచారణ

భూవివాదం పరిష్కరించేందుకు భారీగా లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్‌ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. నాగరాజు సహా అతనికి లంచం ఇచ్చిన రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాధ్‌తో పాటు వీఆర్వో సాయిరాజ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అయితే నాగరాజు బంధువులు, స్నేహితులపై కూడా అనిశా దృష్టి పెట్టింది. గతంలో ఆయన షామీర్‌పేట్‌లో పనిచేసినప్పుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయ్యాడు. జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పటికీ... లంచాలు డిమాండ్‌ చేసి మరీ తీసుకునేవాడని అనిశా అధికారులు గుర్తించారు.

భారీగానే అక్రమాస్తులు..

అల్వాల్‌లోని నాగరాజు నివాసంలో 28 లక్షల రూపాయల నగదు, అరకిలో బంగారు నగలు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు లాకర్లను గుర్తించిన విచారణ బృందం వాటిని తెరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. లాకర్లలో భారీగానే నగదు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కీసరలోని అతని కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా తహసీల్దార్ నాగరాజు అవినీతి అక్రమాలకు సంబంధించి ముందుగానే ఏసీబీకి ఫిర్యాదులందినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అతని కదలికలపై నిఘా ఉంచిన ఉన్నతాధికారులు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నట్టు తెలుస్తోంది.

కొవిడ్​ పరీక్షల కోసం ఉస్మానియాకు తరలింపు

నిందితులకు కొవిడ్‌ పరీక్షలతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శనివారం వారిని అనిశా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నారు. నాగరాజును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది.

ఇదీచూడండి: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్

భూవివాదం పరిష్కరించేందుకు భారీగా లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్‌ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. నాగరాజు సహా అతనికి లంచం ఇచ్చిన రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాధ్‌తో పాటు వీఆర్వో సాయిరాజ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అయితే నాగరాజు బంధువులు, స్నేహితులపై కూడా అనిశా దృష్టి పెట్టింది. గతంలో ఆయన షామీర్‌పేట్‌లో పనిచేసినప్పుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయ్యాడు. జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పటికీ... లంచాలు డిమాండ్‌ చేసి మరీ తీసుకునేవాడని అనిశా అధికారులు గుర్తించారు.

భారీగానే అక్రమాస్తులు..

అల్వాల్‌లోని నాగరాజు నివాసంలో 28 లక్షల రూపాయల నగదు, అరకిలో బంగారు నగలు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు లాకర్లను గుర్తించిన విచారణ బృందం వాటిని తెరిచే ప్రయత్నాల్లో ఉన్నారు. లాకర్లలో భారీగానే నగదు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కీసరలోని అతని కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా తహసీల్దార్ నాగరాజు అవినీతి అక్రమాలకు సంబంధించి ముందుగానే ఏసీబీకి ఫిర్యాదులందినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అతని కదలికలపై నిఘా ఉంచిన ఉన్నతాధికారులు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నట్టు తెలుస్తోంది.

కొవిడ్​ పరీక్షల కోసం ఉస్మానియాకు తరలింపు

నిందితులకు కొవిడ్‌ పరీక్షలతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శనివారం వారిని అనిశా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరచనున్నారు. నాగరాజును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది.

ఇదీచూడండి: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.