ETV Bharat / state

ఏపీ: సలాం పోరాట సమితి 'చలో అసెంబ్లీ' అడ్డగింత

ఏపీలోని సలాం కుటుంబం ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అబ్దుల్‌ సలాం న్యాయపోరాట సమితి.. నేడు 'చలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు వీరికి మద్దతు పలికాయి. దీంతో రాత్రి నుంచి పలువురు నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు.

author img

By

Published : Dec 3, 2020, 1:32 PM IST

abdul
సలాం పోరాట సమితి 'చలో అసెంబ్లీ' అడ్డగింత.. నేతల గృహనిర్బంధం

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ.. అబ్దుల్‌ సలాం న్యాయపోరాట సమితి నేడు 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపాతో పాటు కాంగ్రెస్‌, బీఎస్పీ, ముస్లిం లీగ్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విజయవాడ, గుంటూరు, కడప, విశాఖపట్టణం, ముస్లిం సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి పోలీసులు ఎక్కడికక్కడ ముస్లిం సంఘ నాయకులను, తెదేపా నేతలను గృహ నిర్భంధాలు చేస్తున్నారు. విజయవాడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో పాటు మరికొందరు నేతలకు ముందస్తు నోటీసులిచ్చి గృహనిర్బంధం చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన పలువురు ముస్లిం సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

సీపీఐ మద్దతు

ముస్లిం మైనారిటీ సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి సీపీఐ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ నేత రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపుల కారణంగానే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

గుంటూరులో..

సలాం పోరాట సమితి నేతలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. గుంటూరు మాయాబజార్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల మాటలను బేఖాతరు చేసిన నాయకులు కొంతదూరం ముందుకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ సీతారామయ్య ఆందోళనకారులను అరెస్ట్ చేసి లాలాపేట స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

ఇదీ చదవండి: నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ.. అబ్దుల్‌ సలాం న్యాయపోరాట సమితి నేడు 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపాతో పాటు కాంగ్రెస్‌, బీఎస్పీ, ముస్లిం లీగ్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విజయవాడ, గుంటూరు, కడప, విశాఖపట్టణం, ముస్లిం సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి పోలీసులు ఎక్కడికక్కడ ముస్లిం సంఘ నాయకులను, తెదేపా నేతలను గృహ నిర్భంధాలు చేస్తున్నారు. విజయవాడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో పాటు మరికొందరు నేతలకు ముందస్తు నోటీసులిచ్చి గృహనిర్బంధం చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన పలువురు ముస్లిం సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

సీపీఐ మద్దతు

ముస్లిం మైనారిటీ సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీకి సీపీఐ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ నేత రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపుల కారణంగానే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

గుంటూరులో..

సలాం పోరాట సమితి నేతలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. గుంటూరు మాయాబజార్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల మాటలను బేఖాతరు చేసిన నాయకులు కొంతదూరం ముందుకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ సీతారామయ్య ఆందోళనకారులను అరెస్ట్ చేసి లాలాపేట స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

ఇదీ చదవండి: నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.