ETV Bharat / state

Aasara Pension News: అర్హులకు అందని ఆసరా... రెండున్నరేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘ఆసరా’ పింఛను పథకం(Aasara pension scheme) అర్హులకు అందడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛన్‌ బ్యాంకు ఖాతాల్లోకి రాలేదు. ఇటీవల వృద్ధాప్య పింఛను అర్హత వయసు తగ్గించాక స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలుకాలేదు. దీంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్నారు.

author img

By

Published : Nov 22, 2021, 8:12 AM IST

Aasara pension
Aasara pension

రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం ఎంతోమంది వృద్ధులు, వితంతువులు(Aasara pension latest news) ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారికి, ఇంటిపెద్దను కోల్పోయి ఆసరా కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా రెండున్నరేళ్లుగా పింఛను మంజూరు కావడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛను బ్యాంకు ఖాతాల్లోకి రాలేదు. ఇటీవల వృద్ధాప్య పింఛను అర్హత వయసు తగ్గించాక స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలుకాలేదు. వృద్ధాప్య పింఛన్లకు గతంలో అర్హత వయసు 65 ఏళ్లుగా ఉంది. వితంతువులు, దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చుతోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు వితంతువులు ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు(Aasara pension scheme news) చేసుకుంటున్నారు. వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే రెండున్నరేళ్లుగా దరఖాస్తులు తీసుకుని, పింఛను పొందేందుకు అర్హత కల్పించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు.

2019 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లలో పింఛనుకు అర్హత పొందిన లబ్ధిదారులు దాదాపు లక్ష మందికిపైగా ఉంటారని అంచనా. నెలకు రూ. 2,016 వస్తే అనారోగ్య అవసరాలు తీరుతాయని ఆశిస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా(Aasara pension in telangana) ఆగస్టులో తొలుత 7.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో మరోసారి అవకాశమివ్వడంతో మరో 40 వేల వరకు వచ్చినట్లు తెలిసింది. వీటిని ఎప్పటి నుంచి పరిష్కరించాలో గ్రామీణాభివృద్ధిశాఖ నిబంధనలు, గడువును వెల్లడించలేదు. అర్హత వయసు తగ్గించాక కొత్తగా వచ్చిన 7.8 లక్షల దరఖాస్తుల్లో.. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఉన్నారు.

నెలకు రూ. 180 కోట్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం 37.48 లక్షలమంది వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు రూ. 3,016, ఇతర కేటగిరీల వారికి ఆసరా పింఛన్ల (Aasara pensions) కింద నెలకు రూ. 2,016 పింఛను అందుతోంది. దీనికోసం నెలనెలా ప్రభుత్వం రూ. 1,000 కోట్లు వెచ్చిస్తోంది. గత రెండున్నరేళ్లుగా అర్హత పొందినా పింఛన్లు పొందలేకపోయిన లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటే నెలకు రూ. 180 కోట్లు అదనంగా అవసరమని అంచనా.

పింఛను కోసం ఎదురు చూపులు...

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట వాసి బోయిన ఈశ్వరమ్మ భర్త బుచ్చయ్య మూడేళ్ల క్రితం మరణించారు. పంచాయతీ సిబ్బంది ఆమెకు పింఛను కోసం దరఖాస్తు చేయించారు. అప్పటికే పెన్షన్‌ పొందుతున్న భర్త పేరును జాబితా నుంచి తొలగించలేదు. ఈ కారణంతో ఇప్పటికీ ఈశ్వరమ్మకు ‘ఆసరా’ లభించలేదు. మరోవంక.. ఈశ్వరమ్మ కుమారుడు అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. కోడలు, ఆమె ముగ్గురు చిన్నారుల బాధ్యత కూడా ఈశ్వరమ్మపైనే పడింది. పుట్టెడు కష్టాల్లో ఉన్నా తమకు పింఛను ఇవ్వకపోతే ఎలా అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

ఇదీ చదవండి: Rain Effect on Paddy: వర్షాలతో అన్నదాతల కష్టాలు.. మొలకెత్తిన వరిధాన్యం

రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం ఎంతోమంది వృద్ధులు, వితంతువులు(Aasara pension latest news) ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారికి, ఇంటిపెద్దను కోల్పోయి ఆసరా కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా రెండున్నరేళ్లుగా పింఛను మంజూరు కావడం లేదు. మండల, పంచాయతీ కార్యాలయాల్లో నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని, పరిష్కరించినా పింఛను బ్యాంకు ఖాతాల్లోకి రాలేదు. ఇటీవల వృద్ధాప్య పింఛను అర్హత వయసు తగ్గించాక స్వీకరించిన 7.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ మొదలుకాలేదు. వృద్ధాప్య పింఛన్లకు గతంలో అర్హత వయసు 65 ఏళ్లుగా ఉంది. వితంతువులు, దివ్యాంగులకు వయసుతో సంబంధం లేకుండా లబ్ధి చేకూర్చుతోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు వితంతువులు ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు(Aasara pension scheme news) చేసుకుంటున్నారు. వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే రెండున్నరేళ్లుగా దరఖాస్తులు తీసుకుని, పింఛను పొందేందుకు అర్హత కల్పించినప్పటికీ నిధులు మంజూరు కాలేదు.

2019 నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండేళ్లలో పింఛనుకు అర్హత పొందిన లబ్ధిదారులు దాదాపు లక్ష మందికిపైగా ఉంటారని అంచనా. నెలకు రూ. 2,016 వస్తే అనారోగ్య అవసరాలు తీరుతాయని ఆశిస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా(Aasara pension in telangana) ఆగస్టులో తొలుత 7.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో మరోసారి అవకాశమివ్వడంతో మరో 40 వేల వరకు వచ్చినట్లు తెలిసింది. వీటిని ఎప్పటి నుంచి పరిష్కరించాలో గ్రామీణాభివృద్ధిశాఖ నిబంధనలు, గడువును వెల్లడించలేదు. అర్హత వయసు తగ్గించాక కొత్తగా వచ్చిన 7.8 లక్షల దరఖాస్తుల్లో.. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఉన్నారు.

నెలకు రూ. 180 కోట్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం 37.48 లక్షలమంది వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు రూ. 3,016, ఇతర కేటగిరీల వారికి ఆసరా పింఛన్ల (Aasara pensions) కింద నెలకు రూ. 2,016 పింఛను అందుతోంది. దీనికోసం నెలనెలా ప్రభుత్వం రూ. 1,000 కోట్లు వెచ్చిస్తోంది. గత రెండున్నరేళ్లుగా అర్హత పొందినా పింఛన్లు పొందలేకపోయిన లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటే నెలకు రూ. 180 కోట్లు అదనంగా అవసరమని అంచనా.

పింఛను కోసం ఎదురు చూపులు...

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట వాసి బోయిన ఈశ్వరమ్మ భర్త బుచ్చయ్య మూడేళ్ల క్రితం మరణించారు. పంచాయతీ సిబ్బంది ఆమెకు పింఛను కోసం దరఖాస్తు చేయించారు. అప్పటికే పెన్షన్‌ పొందుతున్న భర్త పేరును జాబితా నుంచి తొలగించలేదు. ఈ కారణంతో ఇప్పటికీ ఈశ్వరమ్మకు ‘ఆసరా’ లభించలేదు. మరోవంక.. ఈశ్వరమ్మ కుమారుడు అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. కోడలు, ఆమె ముగ్గురు చిన్నారుల బాధ్యత కూడా ఈశ్వరమ్మపైనే పడింది. పుట్టెడు కష్టాల్లో ఉన్నా తమకు పింఛను ఇవ్వకపోతే ఎలా అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

ఇదీ చదవండి: Rain Effect on Paddy: వర్షాలతో అన్నదాతల కష్టాలు.. మొలకెత్తిన వరిధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.