వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ మియాపూర్లో చోటుచేసుకుంది. విశాఖపట్టణానికి చెందిన బలరామ్ మోహన్ స్థానిక ఆదిత్య ఇంపీరియల్ హైట్స్లోని 13వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.