హైదరాబాద్ బేగంపేటలోని లిస్బన్ పబ్ యజమాని మురళీకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. డ్యాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది.
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళా డ్యాన్సర్ ఈనెల 28న రాత్రి 11 గంటల 55 నిమిషాలకు బేగంపేటలోని లిస్బన్ పబ్కు వెళ్లింది. ఆ సమయంలో పబ్ యజమాని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేసింది.
గతంలోనూ మురళీకృష్ణ తనతో అలాగే వ్యవహరించాడని, నిన్న రాత్రి 7.30 గంటలకు మరోసారి పబ్కు రాగా లోపలికి అనుమతించకుండా అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పబ్ యజమానిపై నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
- ఇదీ చూడండి : గబ్బుకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోన్న పబ్బులు