నగరంలో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా వీఎస్టీ నుంచి రాంనగర్కు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు అడ్డంగా నేలకొరిగింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. స్థానికంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వీఎస్టీ నుంచి రాంనగర్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు వర్షం నీరు రోడ్డుపై నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కూలిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమాచారం జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ పోలీసులకు తెలుపగా.. ఆ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు.
ఇదీ చూడండి : భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్కు అంతరాయం