ETV Bharat / state

రెండేళ్ల బాలుడిని అమ్మకానికి పెట్టిన జంట అరెస్ట్​ - బాలుడిని అమ్మకానికి పెట్టిన జంట అరెస్ట్​

ఏ తల్లి కన్నబిడ్డో అంగడి బొమ్మ అయ్యాడు... దొరికిన బిడ్డను అమ్ముకుని సొమ్ము చేసుకోడానికి ఓ జంట ప్రయత్నిస్తే... బిడ్డను కొనుక్కుని తల్లిదండ్రులయ్యేందుకు ఇంకో జంట తాపత్రయం వెరసి బిడ్డను బేరానికి పెట్టారు. ఈ తంతు అంతటికీ మధ్యవర్తిగా ఓ వ్యక్తి చేరాడు. చివరకు ఐదుగురు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

a couple arrested for selling boy
బాలుడిని అమ్మకానికి పెట్టిన జంట అరెస్ట్​
author img

By

Published : Feb 4, 2020, 9:57 PM IST

Updated : Feb 4, 2020, 11:30 PM IST

అమ్మ ఒడిలో ఉండాల్సిన బాలుడు... అంగట్లో బొమ్మ అయ్యాడు

ఏ అభాగ్యురాలికి పుట్టాడో తెలీదు గాని ఓ రెండేళ్ల బాలుడు అంగట్లో వస్తువు అయ్యాడు. తల్లి పాలకోసం తల్లడిల్లే వయసులో బేరగాళ్లకు ఆస్తిగా... పిల్లలు లేని జంటకు బిడ్డగా మారబోయాడు. హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​లో రెండేళ్ల బాలుడిని ఇద్దరు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విక్రయిస్తున్న వారిని... కొనుగోలు చేస్తున్న వారిని అరెస్టు చేశారు.

అసలు ఏమి జరిగిందంటే...

కాచిగూడకు చెందిన కృష్ణ, కవిత దంపతులకు పిల్లలు లేకపోవడం వల్ల బిడ్డకోసం అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి ద్వారా ఓ బిడ్డ అమ్మకానికి ఉన్నాడని తెలిసి వెళ్లారు. రూ. 50 వేలు చెల్లించి బిడ్డను దక్కించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విషయం బయటకొచ్చి పోలీసులకు చిక్కారు.

బిడ్డను విక్రయానికి పెట్టిన బోరబండకు చెందిన మహేశ్వరి, పరశురామ్​లు తమకు పిల్లాడు మూసాపేటలోని కూరగాయల మార్కెట్​లో దొరికినట్లు చెబుతున్నారు. బిడ్డను అమ్ముతున్న, కొనడానికొచ్చిన... మధ్యవర్తిత్వం జరిపిన అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని... పిల్లాడిని శిశు విహార్​కు తరలించారు.

ఇదీ చూడండి: కామారెడ్డిలో పదో తరగతి అమ్మాయి అదృశ్యం

అమ్మ ఒడిలో ఉండాల్సిన బాలుడు... అంగట్లో బొమ్మ అయ్యాడు

ఏ అభాగ్యురాలికి పుట్టాడో తెలీదు గాని ఓ రెండేళ్ల బాలుడు అంగట్లో వస్తువు అయ్యాడు. తల్లి పాలకోసం తల్లడిల్లే వయసులో బేరగాళ్లకు ఆస్తిగా... పిల్లలు లేని జంటకు బిడ్డగా మారబోయాడు. హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​లో రెండేళ్ల బాలుడిని ఇద్దరు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విక్రయిస్తున్న వారిని... కొనుగోలు చేస్తున్న వారిని అరెస్టు చేశారు.

అసలు ఏమి జరిగిందంటే...

కాచిగూడకు చెందిన కృష్ణ, కవిత దంపతులకు పిల్లలు లేకపోవడం వల్ల బిడ్డకోసం అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి ద్వారా ఓ బిడ్డ అమ్మకానికి ఉన్నాడని తెలిసి వెళ్లారు. రూ. 50 వేలు చెల్లించి బిడ్డను దక్కించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విషయం బయటకొచ్చి పోలీసులకు చిక్కారు.

బిడ్డను విక్రయానికి పెట్టిన బోరబండకు చెందిన మహేశ్వరి, పరశురామ్​లు తమకు పిల్లాడు మూసాపేటలోని కూరగాయల మార్కెట్​లో దొరికినట్లు చెబుతున్నారు. బిడ్డను అమ్ముతున్న, కొనడానికొచ్చిన... మధ్యవర్తిత్వం జరిపిన అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని... పిల్లాడిని శిశు విహార్​కు తరలించారు.

ఇదీ చూడండి: కామారెడ్డిలో పదో తరగతి అమ్మాయి అదృశ్యం

Last Updated : Feb 4, 2020, 11:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.