ETV Bharat / state

TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 715 కరోనా కేసులు.. నలుగురు మృతి

author img

By

Published : Jul 16, 2021, 7:24 PM IST

Updated : Jul 16, 2021, 7:54 PM IST

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,13,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 715 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్​తో నలుగురు మృతి చెందారు.

corona cases
కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 715 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,35,320కి చేరింది. తాజాగా వైరస్​తో నలుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,699కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,13,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి 784 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,21,541కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,028 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగతా వారు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.83 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,06,874 మందికి పరీక్షలు చేయగా ప్రైవేట్​లో 6,195 కొవిడ్​ టెస్ట్​ చేశారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో 76 నమోదు కాగా ఖమ్మం జిల్లాలో 68, నల్గొండ 54, కరీంనగర్​ 52, వరంగల్​ అర్బన్​ 49, మంచిర్యాల 45, పెద్దపల్లి 41, భద్రాద్రి కొత్తగూడెం 39, రంగారెడ్డి 31, మేడ్చల్​ మల్కాజిగిరి 27, సూర్యాపేట 29, జగిత్యాల 25, సిద్దిపేట 21, రాజన్న సిరిసిల్ల 18, మహబూబాబాద్​ 17, యాదాద్రి భువనగిరి 16, వరంగల్​ రూరల్​ 13, జయశంకర్​ భూపాలపల్లి 13, ములుగు 12, నిజామాబాద్​ 10, జనగామ 9, సంగారెడ్డి 7, వనపర్తి 7, జోగులాంబ గద్వాల 6, నాగర్​ కర్నూల్​ 6, మహబూబ్​నగర్​ 5, కామారెడ్డి 4, కుమురం భీం ఆసిఫాబాద్​ 4, మెదక్​ 4, ఆదిలాబాద్​ 2, నిర్మల్​ 2, వికారాబాద్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు.

ఇదీ చదవండి: విభజన చట్టం ప్రకారమే ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు : కేంద్ర జల్‌శక్తి శాఖ

రాష్ట్రంలో కొత్తగా 715 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,35,320కి చేరింది. తాజాగా వైరస్​తో నలుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,699కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,13,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి 784 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,21,541కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,028 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగతా వారు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.83 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,06,874 మందికి పరీక్షలు చేయగా ప్రైవేట్​లో 6,195 కొవిడ్​ టెస్ట్​ చేశారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో 76 నమోదు కాగా ఖమ్మం జిల్లాలో 68, నల్గొండ 54, కరీంనగర్​ 52, వరంగల్​ అర్బన్​ 49, మంచిర్యాల 45, పెద్దపల్లి 41, భద్రాద్రి కొత్తగూడెం 39, రంగారెడ్డి 31, మేడ్చల్​ మల్కాజిగిరి 27, సూర్యాపేట 29, జగిత్యాల 25, సిద్దిపేట 21, రాజన్న సిరిసిల్ల 18, మహబూబాబాద్​ 17, యాదాద్రి భువనగిరి 16, వరంగల్​ రూరల్​ 13, జయశంకర్​ భూపాలపల్లి 13, ములుగు 12, నిజామాబాద్​ 10, జనగామ 9, సంగారెడ్డి 7, వనపర్తి 7, జోగులాంబ గద్వాల 6, నాగర్​ కర్నూల్​ 6, మహబూబ్​నగర్​ 5, కామారెడ్డి 4, కుమురం భీం ఆసిఫాబాద్​ 4, మెదక్​ 4, ఆదిలాబాద్​ 2, నిర్మల్​ 2, వికారాబాద్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు.

ఇదీ చదవండి: విభజన చట్టం ప్రకారమే ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు : కేంద్ర జల్‌శక్తి శాఖ

Last Updated : Jul 16, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.