ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 82 ఉండగా.. రాష్ట్రంలో 136 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

author img

By

Published : Jun 10, 2020, 3:17 PM IST

Updated : Jun 10, 2020, 4:18 PM IST

ఆంద్రప్రదేశ్ లో కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15384 మంది నమూనాలు పరీక్షించగా 218 పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 82 ఉండగా.. రాష్ట్రంలో 136 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,247 కేసులు నమోదయ్యాయి.

కొవిడ్‌-19 కారణంగా గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్-19 వల్ల మృతి చెందిన వారి సంఖ్య 78కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 2,475 చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1573 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15384 మంది నమూనాలు పరీక్షించగా 218 పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 82 ఉండగా.. రాష్ట్రంలో 136 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,247 కేసులు నమోదయ్యాయి.

కొవిడ్‌-19 కారణంగా గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్-19 వల్ల మృతి చెందిన వారి సంఖ్య 78కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 2,475 చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1573 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి…

దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు

Last Updated : Jun 10, 2020, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.