ETV Bharat / state

AP CORONA: ఏపీలో కొత్తగా 2,145 కరోనా కేసులు, 24 మరణాలు

author img

By

Published : Aug 5, 2021, 6:00 PM IST

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,468కి పెరిగింది.

ap covid cases
ap covid cases

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

మరోవైపు.. 2,003 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,302 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో నలుగురు, కడప, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

మరోవైపు.. 2,003 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,302 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో నలుగురు, కడప, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో జిల్లాల వారీగా కొవిడ్​ కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొవిడ్​ కేసులు

ఇదీ చూడండి: ప్రపంచంపై 'డెల్డా' పడగ- ఆ నగరంలో ఆరోసారి లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.