హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని చింతల్మెట్ ఎమ్ఎమ్ పహాడీలో మహమ్మద్ మస్తాన్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఆయనకి భార్య, పదకొండేళ్ల మెన్హాజ్ బేగం, తొమ్మిది సంవత్సరాల నైనా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
ఇద్దరూ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వీరిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితిలో మార్పులేకపోవడం వల్ల హఫీజ్పేటలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెన్హాజ్ బేగంను చేర్చుకున్న ఆసుపత్రి వర్గాలు... నైనాను నిలోఫర్కు తీసుకువెళ్లాలని సూచించారు.
నైనా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంతలోనే మెన్హాజ్ బేగం కూడా చనిపోయింది. ఇద్దరు ఒకేసారి అస్వస్థతకు గురికావడం, ఒకే రోజు చనిపోవడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చిన్నారుల మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ