తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసి తీరుతామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా భాజపా అఖండ విజయం సాధించాక తొలిసారి హైదరాబాద్కు వచ్చిన షా... పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో భాజపా 20 శాతం ఓట్లు సాధించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్లో కలిపేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానం లేకుండా పోయిందని, అయినా పరాజయాన్ని అంగీకరించలేకపోతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్ తదితరులు అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరారు.
ఇదీ చూడండి: తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రారంభించిన అమిత్ షా