తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగుపడింది. ఆయుఃప్రమాణాలు పెరుగుతున్నాయి. వీటితో పాటు మరెన్నో వాస్తవాలను ఈ సర్వే కళ్లకు కట్టింది. ఈ చేదు నిజాలతోపాటు కొన్ని తీపి కబుర్లనూ అందించింది. మరణ శాతాలు తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2041 నాటికి జనాభా వృద్ధిరేటు సున్నాకు చేరుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. వచ్చే 2 దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యుక్తవయస్కుల సంఖ్య 10% తగ్గిపోయి 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో 2018-19 ఏడాది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అందులో వివరాలు.
- 2015-16 నుంచి 2018-19 మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పురోగమనంలో సాగింది. భేటీ బచావో- భేటీ పఢావో కార్యక్రమం పెద్ద రాష్ట్రాలపై మంచి ప్రభావాన్ని చూపింది. లింగనిష్పత్తి 980కి మించి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేరాయి. 2015-16 నాటికి ఏపీలో ఈ నిష్పత్తి 873 లోపు ఉంది.
- 5- 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో బడికి వెళ్లేవారి సంఖ్య దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది.
- ఆంధ్రప్రదేశ్తోపాటు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లలో 40% ప్రాథమిక పాఠశాలల్లో 50%కంటే తక్కువ పిల్లలున్నారు.
- ఏపీలో 2001లో సగటు సంతాన సాఫల్య నిష్పత్తి 2.3% ఉండగా 2041 నాటికి అది 1.5%కి చేరనుంది. తెలంగాణలోనూ ఇది 2.3% నుంచి 1.6%కి చేరే అవకాశం కనిపిస్తోంది.2041కి తెలంగాణ ఆర్థిక సర్వే అంశాలు2041కి తెలంగాణ ఆర్థిక సర్వే అంశాలు
ఇదీ చూడండి : నకిలీ విత్తన విక్రేతల మెడ చుట్టూ బిగుస్తున్న 'పీడీ'కిలి