ETV Bharat / state

MLA Haripriya: కొవిడ్ బాధితులు మనోధైర్యంతో వ్యాధిని ఎదుర్కోవాలి

author img

By

Published : Jun 1, 2021, 9:41 AM IST

హోం ఐసోలేషన్​లో ఉన్న కొవిడ్ బాధితులు ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లకు రావాలని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సూచించారు. మహమ్మారి సోకిన వారు మనోధైర్యంతో వ్యాధిని ఎదుర్కోవాలని చెప్పారు.

yellandu mla, yellandu mla hari priya naik, corona cases in yellandu
ఇల్లందు ఎమ్మెల్యే, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఇల్లందులో కరోనా కేసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఒడ్డుగూడెం, చల్ల సముద్రం, రేపల్లెవాడ పంచాయతీలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే హరిప్రియ పర్యటించారు. కొవిడ్ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. వారికి కూరగాయలు పంపిణీ చేశారు.

వైద్య సిబ్బందిని కలిసి కరోనా బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆక్సీమీటర్ సాయంతో బాధితుల ఆక్సిజన్ స్థాయిని స్వయంగా పరిశీలించారు. కరోనా బాధితులు హోం ఐసోలేషన్​లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. వెంటనే సర్కార్ ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు రావాలని సూచించారు. మనోధైర్యంతో మహమ్మారిని ఎదుర్కోవాలని ధైర్యం చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఒడ్డుగూడెం, చల్ల సముద్రం, రేపల్లెవాడ పంచాయతీలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే హరిప్రియ పర్యటించారు. కొవిడ్ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. వారికి కూరగాయలు పంపిణీ చేశారు.

వైద్య సిబ్బందిని కలిసి కరోనా బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆక్సీమీటర్ సాయంతో బాధితుల ఆక్సిజన్ స్థాయిని స్వయంగా పరిశీలించారు. కరోనా బాధితులు హోం ఐసోలేషన్​లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. వెంటనే సర్కార్ ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు రావాలని సూచించారు. మనోధైర్యంతో మహమ్మారిని ఎదుర్కోవాలని ధైర్యం చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.