ETV Bharat / state

'విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడు?'

author img

By

Published : Apr 22, 2022, 9:29 AM IST

Wife fights for husband: ప్రేమైనా, పెళ్లైనా ఆడమగను కలిపే ఆ బంధం పదికాలాల పాటు చల్లగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ బంధం వర్ధిల్లడమనేది వారి మధ్య ఉండే సఖ్యతపైన ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం మనస్పర్థలు వచ్చినా.. ఒకరిపై ఒకరికి ఆసక్తి సన్నగిల్లినా ఆ బంధం క్రమక్రమంగా బలహీనపడుతుంది. అదే మరొకరిపై ఆసక్తికి దారితీస్తుంది. సరిగ్గా వారం క్రితం ఖమ్మంలోని ఓ పెళ్లి పందిట్లో ప్రియుడి పెళ్లిని ఆపేందుకు వచ్చిన యువతిపై వధువు బంధువులు అమానవీయంగా దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఆ బంధం ప్రేమతో ఆగిపోతే.. ఇక్కడ ఈ బంధం మాత్రం ప్రేమ నుంచి పెళ్లి వరకూ చేరి.. అది కాస్త వికటించి.. ఆ ప్రబుద్ధుడు మరో అమ్మాయిని వివాహం చేసుకునే స్థితికి తీసుకువచ్చింది. ఇది తెలిసిన బాధితురాలు ఆవేశంతో పెళ్లి ఆపేందుకు యత్నించింది. అసలేం జరిగిందంటే..

woman fight for husband
భర్త కోసం మహిళ పోరాటం

Wife fights for husband: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన గురువారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలు బస్తీ ఏరియాలో సంచలనంగా మారింది. బాధితురాలు జాలాది సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సుజాత, ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలుబస్తీ ఏరియాకు చెందిన బి.వంశీ 2013లో ప్రేమించుకుని, 2017లో ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారక తిరుమల ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో వంశీ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కొవ్వూరు పోలీసు స్టేషనులో కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు కోర్టులో కొనసాగుతుంది.

రెండో వివాహమా.?: భార్యాభర్తల వివాదం నేపథ్యంలో తనకు గతంలోనే వివాహం జరిగిందని వంశీ చేసిన ఆరోపణలపై న్యాయస్థానాల్లో కేసులు జరిగాయని సుజాత తెలిపారు. తనకూ, వంశీకి ఇద్దరికీ తొలి వివాహమే జరిగిందని.. వంశీ చేసిన తప్పుడు ఆరోపణలను రాజమండ్రి జిల్లా న్యాయస్థానం కొట్టివేసిందని వివరించారు. కొవ్వూరు జిల్లా న్యాయస్థానంలో ప్రస్తుతం మూడు కేసులు నడుస్తున్నాయని.. తాను, వంశీ వాయిదాలకు వెళ్లడం జరుగుతోందని చెప్పారు. వివాదాలు నడుస్తుండగానే రెండేళ్లుగా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. తన కంటే ఎక్కువ కట్నం వస్తుందని చెబుతున్నాడని భార్య ఉండగానే మరో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో వంశీ పట్టణంలోని సబ్‌జైలుబస్తీకి చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. గురువారం స్థానిక 24 ఏరియా సింగరేణి వైసీఓఏ క్లబ్‌లో ఉదయం 9 గంటలకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పెళ్లిని అడ్డుకునేందుకు వైసీఓఏ క్లబ్‌ వద్దకు వచ్చి ఎవరూ లేకపోవడంతో వధూవరుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఈక్రమంలో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు, సుజాతకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

కేసు కోర్టులో ఉండగా, విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటాడని బాధితురాలు ప్రశ్నించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు సిబ్బందిని పంపించి బాధితురాలిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. కేసు కోర్టులో ఉన్నందున తాము ఏమీ చేయలేమని తెలపడంతో బాధితురాలు చేసేదేమిలేక వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వెళ్లిపోయారు.

* సుజాతకు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు వాగ్వివాదం జరుగుతుండగా, ముందస్తుగా సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పెళ్లిని వైసీఓఏ క్లబ్‌లో కాకుండా గోప్యంగా ఇంట్లోనే చేశారు. పెళ్లి జరగలేదని ప్రచారం చేశారు. వారిని నమ్మి పోలీసు స్టేషనుకు వెళ్లిన సుజాతకు పెళ్లి జరిగినట్లు ఆలస్యంగా తెలియడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ఇవీ చదవండి: 'మా అమ్మకు అరుదైన వ్యాధి అంట.. దయచేసి ఆదుకోండి సారూ!'

'మరియుపోల్​కు విముక్తి..' ఆ ప్రాంతాన్ని చట్టుముట్టొద్దని పుతిన్ ఆదేశం

Wife fights for husband: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన గురువారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలు బస్తీ ఏరియాలో సంచలనంగా మారింది. బాధితురాలు జాలాది సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సుజాత, ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలుబస్తీ ఏరియాకు చెందిన బి.వంశీ 2013లో ప్రేమించుకుని, 2017లో ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారక తిరుమల ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో వంశీ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కొవ్వూరు పోలీసు స్టేషనులో కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు కోర్టులో కొనసాగుతుంది.

రెండో వివాహమా.?: భార్యాభర్తల వివాదం నేపథ్యంలో తనకు గతంలోనే వివాహం జరిగిందని వంశీ చేసిన ఆరోపణలపై న్యాయస్థానాల్లో కేసులు జరిగాయని సుజాత తెలిపారు. తనకూ, వంశీకి ఇద్దరికీ తొలి వివాహమే జరిగిందని.. వంశీ చేసిన తప్పుడు ఆరోపణలను రాజమండ్రి జిల్లా న్యాయస్థానం కొట్టివేసిందని వివరించారు. కొవ్వూరు జిల్లా న్యాయస్థానంలో ప్రస్తుతం మూడు కేసులు నడుస్తున్నాయని.. తాను, వంశీ వాయిదాలకు వెళ్లడం జరుగుతోందని చెప్పారు. వివాదాలు నడుస్తుండగానే రెండేళ్లుగా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. తన కంటే ఎక్కువ కట్నం వస్తుందని చెబుతున్నాడని భార్య ఉండగానే మరో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో వంశీ పట్టణంలోని సబ్‌జైలుబస్తీకి చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. గురువారం స్థానిక 24 ఏరియా సింగరేణి వైసీఓఏ క్లబ్‌లో ఉదయం 9 గంటలకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పెళ్లిని అడ్డుకునేందుకు వైసీఓఏ క్లబ్‌ వద్దకు వచ్చి ఎవరూ లేకపోవడంతో వధూవరుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఈక్రమంలో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు, సుజాతకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

కేసు కోర్టులో ఉండగా, విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటాడని బాధితురాలు ప్రశ్నించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు సిబ్బందిని పంపించి బాధితురాలిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. కేసు కోర్టులో ఉన్నందున తాము ఏమీ చేయలేమని తెలపడంతో బాధితురాలు చేసేదేమిలేక వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వెళ్లిపోయారు.

* సుజాతకు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు వాగ్వివాదం జరుగుతుండగా, ముందస్తుగా సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పెళ్లిని వైసీఓఏ క్లబ్‌లో కాకుండా గోప్యంగా ఇంట్లోనే చేశారు. పెళ్లి జరగలేదని ప్రచారం చేశారు. వారిని నమ్మి పోలీసు స్టేషనుకు వెళ్లిన సుజాతకు పెళ్లి జరిగినట్లు ఆలస్యంగా తెలియడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ఇవీ చదవండి: 'మా అమ్మకు అరుదైన వ్యాధి అంట.. దయచేసి ఆదుకోండి సారూ!'

'మరియుపోల్​కు విముక్తి..' ఆ ప్రాంతాన్ని చట్టుముట్టొద్దని పుతిన్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.