భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తగూడెం ప్రధాన రహదారిపై పోలీసులు సీఆర్పీఎఫ్ తనిఖీలు చేపట్టారు. సాధారణ తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
మావోలకు రక్తపరీక్ష నమూనాలు, సిరంజిలు సరఫరా చేసేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. మావోయిస్టులకు ప్రజలు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని ఏఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు