ETV Bharat / state

ప్రశ్నించడం కాదు.. పరిష్కారం చూపాలి: పల్లా రాజేశ్వర్​ రెడ్డి

author img

By

Published : Mar 6, 2021, 4:07 PM IST

సమస్యలపై ప్రశ్నించడం ఒక్కటే కాదని.. వాటికి పరిష్కారం చూపాలని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పలు కళాశాలల అధ్యాపకులతో సమావేశమయ్యారు.

trs mlc candidate palla rajeshwar reddy mlc election campaign in bhadrachalam in bhadradri kothagudem district
ప్రశ్నించడం కాదు.. పరిష్కారం చూపాలి: పల్లా రాజేశ్వర్​ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి కోరారు. భాజపా నాయకులకు కేవలం ప్రశ్నించడం మాత్రమే తెలుసని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'తెరాస నిర్లక్ష్యం వల్లే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఆలస్యం'

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి కోరారు. భాజపా నాయకులకు కేవలం ప్రశ్నించడం మాత్రమే తెలుసని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'తెరాస నిర్లక్ష్యం వల్లే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఆలస్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.