ETV Bharat / state

రామమందిర నిర్మాణానికి వెండి ఇటుక

author img

By

Published : Jan 16, 2021, 10:04 PM IST

అయోధ్యలో జరుగుతున్న రామమందిర నిర్మాణానికి ఓ దంపతులు వెండి ఇటుకని కానుకగా ఇవ్వనున్నారు. భద్రాద్రి రాముని సన్నిధిలో.. పూజల అనంతరం అయోధ్యకు వెండి ఇటుకని తీసుకెళ్తామని వారు తెలిపారు.

Silver brick for the construction of the Ram Mandir
రామమందిర నిర్మాణానికి వెండి ఇటుక

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏపీలోని గుంటూరుకు చెందిన చల్లా శ్రీనివాసరావు, గాయత్రి దంపతులు వెండి ఇటుకను తయారు చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామయ్య సన్నిధిలో ఆ వెండి ఇటుకకి పూజలు నిర్వహించారు.

ఆ ప్రాంతంలోని భక్తుల ద్వారా రాయించిన 7 కోట్ల రామకోటి పత్రాలను భద్రాద్రి ఆలయంలో సమర్పించారు. ఆదివారం భద్రాచలంలో జరిగే నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని.. అనంతరం అయోధ్యకు బయలుదేరనున్నట్లు దంపతులు తెలిపారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏపీలోని గుంటూరుకు చెందిన చల్లా శ్రీనివాసరావు, గాయత్రి దంపతులు వెండి ఇటుకను తయారు చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామయ్య సన్నిధిలో ఆ వెండి ఇటుకకి పూజలు నిర్వహించారు.

ఆ ప్రాంతంలోని భక్తుల ద్వారా రాయించిన 7 కోట్ల రామకోటి పత్రాలను భద్రాద్రి ఆలయంలో సమర్పించారు. ఆదివారం భద్రాచలంలో జరిగే నిత్య కల్యాణ మహోత్సవంలో పాల్గొని.. అనంతరం అయోధ్యకు బయలుదేరనున్నట్లు దంపతులు తెలిపారు.

ఇదీ చూడండి: 'తొలి రోజు లక్షా 91వేల మందికి కరోనా టీకా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.