ETV Bharat / state

వరద ఉద్ధృతి ఉన్నా.. ఆగని పోలవరం ప్రాజెక్ట్ పనులు

author img

By

Published : Aug 25, 2020, 8:02 PM IST

గోదావరి నదిలో వరద ఉద్ధృతి ఉన్నా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 19 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా పనులు నిలిపివేయకుండా స్పిల్ వే, స్పిల్ ఛానెల్​లో కాంక్రీట్​ పనులు చేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. భారీ వర్షాల వల్ల 7 రోజులు పనులు నిలిచినా ప్రస్తుతం వర్షాలు తెరిపినివ్వడంతో వాటిని కొనసాగిస్తున్నారు.

polavaram
polavaram

గోదావరి వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో 7 రోజులు పనులు నిలిచిపోగా... ప్రస్తుతం తెరిపినివ్వడంతో స్పిల్ వే, స్పిల్ ఛానెల్ కాంక్రీటు పనులు చేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ వెల్లడించింది. కొండ తవ్వకం, గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్, మట్టి పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

స్పిల్ వే గేట్లు బిగించేందుకు ట్రూనియన్ బీమ్ తయారీకి షటరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11 బ్లాకుల్లో 44 గడ్డర్లు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్ నిర్మించేందుకు అనువుగా షటరింగ్, డెక్ షీటింగ్ చేస్తున్నారు.

వరద ఉద్ధృతి ఉన్నా.. ఆగని పోలవరం ప్రాజెక్ట్ పనులు

గోదావరి వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో 7 రోజులు పనులు నిలిచిపోగా... ప్రస్తుతం తెరిపినివ్వడంతో స్పిల్ వే, స్పిల్ ఛానెల్ కాంక్రీటు పనులు చేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ వెల్లడించింది. కొండ తవ్వకం, గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్, మట్టి పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

స్పిల్ వే గేట్లు బిగించేందుకు ట్రూనియన్ బీమ్ తయారీకి షటరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11 బ్లాకుల్లో 44 గడ్డర్లు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్ నిర్మించేందుకు అనువుగా షటరింగ్, డెక్ షీటింగ్ చేస్తున్నారు.

వరద ఉద్ధృతి ఉన్నా.. ఆగని పోలవరం ప్రాజెక్ట్ పనులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.