ETV Bharat / state

సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే హరిప్రియ పాలాభిషేకం

author img

By

Published : May 18, 2021, 4:26 PM IST

ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే హరిప్రియ పాలాభిషేకం చేశారు. వైద్య కళాశాలల ప్రకటనపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యే హరిప్రియ
ఎమ్మెల్యే హరిప్రియ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో 6 వైద్య కళాశాలల ప్రకటన చేయడం పట్ల.. ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాజేందర్​, పురపాలక ఛైర్మన్​ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఇల్లందు నియోజక వర్గం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో విస్తరించి ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రకటించిన 6వైద్య కళాశాలల్లో కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాలో ఉండటం వల్ల రెండు జిల్లా గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో 6 వైద్య కళాశాలల ప్రకటన చేయడం పట్ల.. ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాజేందర్​, పురపాలక ఛైర్మన్​ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఇల్లందు నియోజక వర్గం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో విస్తరించి ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రకటించిన 6వైద్య కళాశాలల్లో కొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాలో ఉండటం వల్ల రెండు జిల్లా గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.