ETV Bharat / state

'రాష్ట్రంలో తెరాస పాలన రైతు సంక్షేమ రాజ్యంగా సాగుతోంది'

author img

By

Published : Jun 26, 2020, 8:04 PM IST

తెలంగాణలో ప్రభుత్వ పాలన రైతు సంక్షేమ రాజ్యంగా సాగుతోందని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి పువ్వాడ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

minister puvvada ajay kumar tour in bhadradri kothagudem district
'రాష్ట్రంలో తెరాస పాలన రైతు సంక్షేమ రాజ్యంగా సాగుతోంది'

రాష్ట్రంలో తెరాస పాలన రైతు సంక్షేమ రాజ్యంగా సాగుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పంటల సాగులో రైతులను చైతన్యవంతుల్ని చేసి.. సమగ్ర పంటల సాగువిధానంతో అధిగ దిగుబడులు సాధించేందుకు రైతులకు దిశానిర్దేశం చేసేందుకు రైతు వేదికల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష్యం మేరకు రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి పువ్వాడ వెల్లడించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి పువ్వాడ... పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పలుగ్రామాల్లో మొక్కలు నాటారు.

ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చర్ల మండలంలోని లక్ష్మీనగర్, ఆర్.కొత్తగూడెం, మహదేవపురం గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. చర్లలో 1.19 కోట్లతో నూతనంగా నిర్మించిన 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. దుమ్ముగూడెం, చర్లలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడులో మొక్కలు నాటిన మంత్రి... పాపకొల్లులో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలో తెరాస పాలన రైతు సంక్షేమ రాజ్యంగా సాగుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పంటల సాగులో రైతులను చైతన్యవంతుల్ని చేసి.. సమగ్ర పంటల సాగువిధానంతో అధిగ దిగుబడులు సాధించేందుకు రైతులకు దిశానిర్దేశం చేసేందుకు రైతు వేదికల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్ష్యం మేరకు రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి పువ్వాడ వెల్లడించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి పువ్వాడ... పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పలుగ్రామాల్లో మొక్కలు నాటారు.

ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చర్ల మండలంలోని లక్ష్మీనగర్, ఆర్.కొత్తగూడెం, మహదేవపురం గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. చర్లలో 1.19 కోట్లతో నూతనంగా నిర్మించిన 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. దుమ్ముగూడెం, చర్లలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడులో మొక్కలు నాటిన మంత్రి... పాపకొల్లులో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: రెండోరోజూ జోరుగా సాగిన హరితహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.