ప్రేమించినవాడు మోసం చేశాడని ప్రియుడు ఇంటి ముందు ధర్నాకు దిగిన ఆయువతి కోరిక నేరవేరింది. ఆమెను పెండ్లి చేసుకోవడానికి ఆ యువకుడు అంగీకరించాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన యువతి.. అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. దీంతో ప్రియుడిపై పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐనా మాట వినకపోవడంతో అతడి ఇంటి ముందు మహిళా సంఘాలతో కలిసి ధర్నాకు దిగింది. ఆ తర్వాత ప్రియుడు కిరణ్ పెళ్లికి ఒప్పుకున్నాడు. వెంటనే మహిళా సంఘం సభ్యులు దగ్గరుండి వారిద్దరకి వివాహం జరిపించారు.
ఇదీ చదవండి: అప్పుడు ప్రేమించానన్నాడు.. ఇప్పుడు కాదంటున్నాడు..!