భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక గ్రామంలో లక్ష్మీదేవి జాతరలో ఆదివాసీలు భారీగా పాల్గొన్నారు. జోగ వంశీయుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీలు నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర శుక్రవారం ప్రారంభమైంది. నేటితో ముగియనుంది.
![laxmidevi jaathara at thurubaka village in bhadradri kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11098264_lak.jpg)
కార్యక్రమంలో పినపాక, ఇల్లందు నియోజకవర్గం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు.
ఇదీ చూడండి: అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం