ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జాదవ్ బలరాంకు అపూర్వ గౌరవం దక్కింది. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఐదు వందల మంది విద్యార్థులు రక్తదానం చేసి గురుభక్తి చాటుకున్నారు.
ప్రిన్సిపల్ను తొలుత కారులో ఊరేగించిన విద్యార్థులు సభ ఏర్పాటు చేసి ఆయన స్పూర్తిని కొనియాడారు. తనకు నిర్వహించిన జన్మదిన వేడుకల పట్ల జాదవ్ బలరాం తన్మయులయ్యారు.
ఇదీ చదవండి: ఉపసర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం