భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శ్రీనివాసరెడ్డి మృతికి ఆర్టీసీ కార్మికులు సంతాపం తెలిపారు. జేఏసీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో బయలుదేరి స్థానిక అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పట్టణంలో నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ, ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సోమవారం బంద్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, తెదేపా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య