ETV Bharat / state

నాణ్యమైన విత్తనాలు విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు - జిల్లా కలెక్టర్ ఎన్ వి రెడ్డి - పంటలను పరిశీలించిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గంలో జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి పర్యటించారు. పంటలు, ఉత్పత్తుల విక్రయాల నిర్వహణకు టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు.నాణ్యమైన విత్తనాలు విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Strict action against traders who do not sell quality seeds - District Collector NV Reddy
నాణ్యమైన విత్తనాలు విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు - జిల్లా కలెక్టర్ ఎన్ వి రెడ్డి
author img

By

Published : Nov 7, 2020, 2:13 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గంలో జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి పర్యటించారు. టేకులపల్లి మండలంలో పంట ఉత్పత్తులు, విక్రయాల నిర్వహణకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.వెంకటయ్య తండ గ్రామ పరిధిలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పత్తి విత్తనాలతో దిగుబడి సరిగా రాలేదని రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటలు విక్రయాలు చేయొద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. నీటి సరఫరా కోసం ప్రతి ఇంటి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సర్పంచ్, సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి నివేదిక అందచేయాలని కలెక్టర్ డీపీఓకి సూచించారు.

అనంతరం ఇల్లందులో పర్యటించి రైతు వేదిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.. జనవరి 26న జిల్లా స్థాయిలో రైతు వేదికల నిర్మాణాలను పరిశీలించి మూడింటికి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గంలో జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి పర్యటించారు. టేకులపల్లి మండలంలో పంట ఉత్పత్తులు, విక్రయాల నిర్వహణకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.వెంకటయ్య తండ గ్రామ పరిధిలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పత్తి విత్తనాలతో దిగుబడి సరిగా రాలేదని రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటలు విక్రయాలు చేయొద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. నీటి సరఫరా కోసం ప్రతి ఇంటి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సర్పంచ్, సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి నివేదిక అందచేయాలని కలెక్టర్ డీపీఓకి సూచించారు.

అనంతరం ఇల్లందులో పర్యటించి రైతు వేదిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.. జనవరి 26న జిల్లా స్థాయిలో రైతు వేదికల నిర్మాణాలను పరిశీలించి మూడింటికి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.

ఇవీ చదవండి: సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.